TSPSC పేపర్ లీక్‌పై మంత్రి కేటీఆర్ కీలక

  :

KTR: టీఎస్పీపీఎస్సీ పేపర్ లీక్‌పై మంత్రి కేటీఆర్ కీలక

టీఎస్పీపీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పేపర్ లీక్ కావటం చాలా దురదృష్టకరమని అన్నారు. సీఎం కేసీఆర్‌తో సమావేశం తర్వాత మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇది వ్యవస్థల వైఫల్యం కాదని ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పని అన్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదని అన్నారు. యువత ఆందోళకు గురికావొద్దని నిరుద్యోగ యువతకు సూచించారు. “TSPSC భారతదేశంలోనే అత్యత్తుమైనదిగా పేరుగాంచింది. సంస్కరణల్లో భాగంగా ఓటీఆర్ తీసుకొచ్చాం,  డిజిటల్ పేమెంట్లు తీసుకొచ్చాం. బయోమెట్రిక్, కంప్యూటరైజ్డ్ రిక్రూట్‌మెట్ చేపట్టాం. ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించాం. 4 లక్షల నిరుద్యోగులు పరీక్షలు రాశారు. పారదర్శకత కోసం అనేక చర్యలు చేపట్టాం యూపీఎస్సీ ఛైర్మన్ రెండు సార్లు టీఎస్‌పీఎస్సీని సందర్శించి మన సంస్కరణలు అధ్యయనం చేశారు.

గత ఎనిమిదేళ్లలో దేశంలోనే అత్యధిక ఉద్యోగాలు భర్తీ చేశాం. ఏడు భాషాల్లో ఒకేసారి పరీక్ష నిర్వహించిన ఘనత టీఎస్‌పీఎస్సీది. ఓ ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు ఈరోజు  వ్యవస్థ మొత్తానికి  చెడ్డపేరుతీసుకొచ్చారు. రాష్ట్ర యువతలో భరోసా ఇవ్వాలని సీఎం సూచించారు. ఖచ్చితంగా వీరిద్దరే కాదు పేపర్ లీకేజీ వెనుక ఎవరు ఉన్నా ఎవరిని వదలం తప్పకుండా కఠినంగా శిక్షిస్తాం. ఇది సిస్టమ్ ఫెల్యూర్ కాదు. తప్పు జరిగితే దాన్ని సరిదిద్దే బాధ్యత మాపై ఉంది. ఇది ఇద్దరు వ్యక్తుల తప్పిదం. వ్యవస్థ వైఫల్యం కాదు ఇప్పుడు ఏ మార్పులు చేయాలో వాటికి సంబంధించి పూర్తి సంస్కరణలు తీసుకొస్తాం. రద్దు అయిన నాలుగు పరీక్షలకు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో అప్లై చేసుకున్న వాళ్లంతా అర్హులే సాధ్యమైనంత వరకు ఎగ్జామ్స్  కండక్ట్ చేస్తాం. నాలుగు పరీక్షలకు సంబంధించిన కోచింగ్ మెటీరియల్ ఆన్‌లైన్‌లో ఫ్రీగా అందిస్తాం. రెండు ముడు రోజుల్లో అందుబాటులోకి వస్తుంది. స్టడీ సర్కిళ్లను మరింత బలోపేతం చేస్తాం. స్డడీ సర్కిళ్లలో ఉచిత భోజనం అందిస్తాం. 24 గంటలు రీడింగ్ రూంలు, స్టడీ సర్కిళ్లు తెరిచే ఉంచుతాం.

ఈ ఘటనపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చిత్తశద్ధితో పని చేస్తుందనేది గమనించాలి. తెలంగాణ యువతకు చెబుతున్నా వారి మాటలు పట్టించుకోవద్దు. ఏవైనా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుంటాం. మీ ప్రయోజనాల కోసం నిర్విరామంగా పని చేస్తున్నాం. పార్టీ పరంగా కూడా డీజీపీ గారికి కంప్లైంట్ చేశాం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. నోటిఫికేషన్ ఇవ్వటం కుట్ర అని గంతలో సంజయ్ అన్నారు. వారి పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇప్పుడు ఏ2గా దొరికారు. అందుకే మాకు అనుమానాలు ఉన్నాయి. విచారణ చేపట్టాలని డీజీపీ గారిని బీఆర్ఎస్ పార్టీ తరపున కోరాం.  మరోసారి చెబుతున్నా లీకేజీ ఘటన వెనుక ఏ పార్టీ వాళ్లు ఉన్నా  వదిలి పెట్టే ప్రసక్తే లేదు. అని కేటీఆర్ అన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh