CM Jagan: ఏపీ సీఎం హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం

CM Jagan

CM Jagan: ఏపీ సీఎం హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో రోడ్డుమార్గం ద్వారా నార్పల నుంచి పుట్టపర్తికి చేరుకున్నారు. బుధవారం జగనన్న వసతి  దీవెన బటన్ నొక్కేందుకు  అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి వచ్చారు  జగన్ మోహన్ రెడ్డి గారు . హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడడంతో  గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి అక్కడ్నుంచి హెలికాప్టర్ లో నార్పలకు చేరుకున్నారు. ఉదయం ఆకాశం మేఘావృతం గా ఉన్నప్పటికీ హెలికాప్టర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ అయింది. అయితే  ఒంటి గంటకు బహిరంగ సభ ముగిసింది. తిరుగు సాంకేతిక లోపం వల్ల హెలికాప్టర్ పని చేయకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా బత్తలపల్లి ధర్మవరం మీదుగా పుట్టపర్తికి ప్రత్యేక కాన్వాయ్ లో వెళ్లారు. పుట్టపర్తి నుంచి  ప్రత్యేక విమానంలోగన్నవరంవిమానాశ్రయం చేరుకున్నారు.

ఈరోజు ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించిన CM Jagan నార్పలలో ‘జగనన్న విద్యా దీవెన’’ పథకం నిధులను విద్యార్థుల  తల్లుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ  చదువు కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదనేదే తమ ఉద్దేశమన్నారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని, నాడు-నేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యారంగంలో అనేక సంస్క‌ర‌ణ‌లకు శ్రీ‌కారం చుట్టిన తాము అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు సీఎం జ‌గ‌న్ తెలిపారు.

అంతకు ముందు విద్యా దీవెన నిధులు జమ చేసేందుకు బటన్ నొక్కిన తర్వాత జగన్ మాట్లాడారు.  విద్యార్థులంద‌రూ మైక్రోసాఫ్ట్‌ సీఈవో స‌త్య‌నాదెళ్ల‌ లాగా నిల‌వాల‌ని   ఆకాంక్షించారు.  జ‌ర్మ‌నీ, మెల్ బోర్న్ కంపెనీల‌తో ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని… కోర్సు చ‌దివేట‌ప్పుడే త‌ప్ప‌నిస‌రి చేశామ‌న్నారు. జ‌గ‌న‌న్న విదేశీ విద్య ప‌థ‌కాన్ని కూడా తీసుకొచ్చామ‌న్నారు. ఇచ్చిన‌ మాట మేరకు సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జగనన్న వసతి దీవెన అమలు చేస్తున్నామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి జమ చేస్తున్నామ‌ న్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుందన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh