కల్లుగీత కార్మికులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గీత కార్మికుల కోసం ఏపి ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. 2022 నుంచి 2027 వరకు కల్లు గీత గీత పాలసీని తీసుకొచ్చింది. ఈవృత్తిపై ఆధారపడిన కార్మికుల సంక్షేమం కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022 నుంచి 2027 వరకు కాలానికి కల్లు మద్యం నియంత్రణ విధానానికి అనుగుణంగా కల్లుగీత కార్మికుల కోసం ఈ విధానాన్ని ప్రకటించారు. ఈపాలసీతో రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. కల్లుగీత లైసెన్సింగ్ విధానం కూడా అత్యంత పారదర్శకంగా జరిగేలా పాలసీని రూపొందించారు.
అలాగే కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇందులో రూ.5 లక్షలు వైఎస్సార్ బీమా ద్వారా.. మిగిలిన రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. కల్లు గీత కార్మికుడు సహజ మరణం చెందితే అతని కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందుతుంది.
Marburg virus: ప్రమాదకరమైన మార్బర్గ్ వైరస్కు వ్యతిరేకంగా యూఏఈ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. రకరకాల వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కరోనా, ఎబోలా వంటి ప్రమాదకరమైన వైరస్లతో…
ఢీ కొట్టనున్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ IPL 2023: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు డబుల్ బొనాంజా ఉంది. మరికొద్దిసేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు,…
super court: తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఆందోళనకర రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలు నియామకం సుప్రీంకోర్టు పరిశీలనలోకి రావడంతో ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకాశ్ సింగ్…