దేశం లో పెరుగుతున్న H3N2 కేసులు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

H3N2: దేశం లో పెరుగుతున్న H3N2 కేసులు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

ప్రజలు కరోనా వైరస్ నుంచి కోలుకున్నామని ఊపిరి పీల్చుకునేలోగా కొత్త వైరస్ భయపెడుతోంది. హెచ్3ఎన్2 వైరస్ ఇప్పుడు దేశంలో ఆందోళన కల్గిస్తోంది. హెచ్3ఎన్2 ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది, ఎవరికి తీవ్రంగా మారనుందనే వివరాలు తెలుసుకుందాం

హెచ్3ఎన్2  ఇప్పుడు ఈ  విషయమే చర్చనీయాంశమౌతోంది. భయపెడుతున్న ఈ కొత్త వైరస్ దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తోంది. హెచ్3ఎన్2 వైరస్ ముప్పు ఎవరికి అధికంగా ఉంటుంది, కొత్త వైరస్ లక్షణాలుంటే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటుందా లేదా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్థులకు ఈ వైరస్ ఎలా పరిణమించనుందనే వివరాలు తెలుసుకోవల్సిన అవసరముంది. వివిధ ల్యాబొరేటరీల్లో పరిశీలిస్తున్న శాంపిల్స్‌లో ఇన్‌ఫ్లుయెంజా ఏ అంటే హెచ్3ఎన్2 వైరస్ కనుగొనడం ఆందోళన కల్గిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్వయంగా వెల్లడించారు. వృద్ధులు, చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు తీవ్రంగా మారవచ్చని తెలుస్తోంది.హెచ్ఐఎన్1, హెచ్3ఎన్2, అడినోవైరస్ వృద్ధులు, చిన్నారులకు ఇబ్బంది కల్గించవచ్చని తెలుస్తోంది.

దేశంలో పలు చోట్ల వైరస్  కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ వ్యాధి బారిన పడిన వారు 7 మంది చనిపోవడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పుదిచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి కొనసాగుతున్నందున పది రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అన్ని పాఠశాలలో 8వ తరగతి వరకు సెలవులు ఇస్తున్నామని మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది.

అయితే ఇప్పటి వరకు పుదుచ్చేరిలో మార్చి 11 నాటికి 79 ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదయ్యాయి.  కేసుల సంఖ్య పెరిగితే చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఇన్‌ఫ్లుయెంజా కేసులకు సంబంధించి ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. అయితే కొవిడ్‌ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇటీవల వెల్లడించాయి. జనవరి 2 నుంచి మార్చి 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 451 హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదయినట్టు అటు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా తెలిపింది. ఈ సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా కారణంగా కర్ణాటక, హరియాణా, గుజరాత్‌లో సహా పలు రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh