RRR ఏమయ్యా రామయ్య..ఎందుకయ్య ఈ ప్రయోగం.

RRR ఏమయ్యా రామయ్య..ఎందుకయ్య ఈ ప్రయోగం.

RRR విడుదల తర్వాత ఎన్టీఆర్ తన కొత్త చిత్రాన్ని ఇంకా ప్రారంభించలేదు. కొరటాల శివతో ఆయన సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటూ అతని అభిమానులను కంగారు పెడుతోంది. ఇప్పుడు హను రాఘవపూడి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి స్క్రిప్ట్ ను వినిపించారు అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్.

ఈ వార్త ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. హను తన గత చిత్రం సీతా రామం బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకు పోతున్నాడు. అతను సున్నితమైన ఎమోషన్ ఉన్నటువంటి సినిమాలు తీసి ప్రసిద్ది చెందాడు. ఇలాంటి డైరెక్టర్ హ్యూజ్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్‌కి స్క్రిప్ట్‌ను వివరించడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ వార్త నిజమో కాదో కాలమే నిర్ణయించాలి.

‘గాడ్ ఫాదర్’ OTT రిలీజ్ డేట్ వచ్చేసింది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన రీసెంట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాకు ఈ సినిమా రీమేక్. మలయాళం లో మోహన్ లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి పోషించారు. ఈ సినిమా ఆక్టోబర్ 5 న విడుదల అయి ఇక్కడ మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అటు హిందీ లోనూ సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఒక వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ‘గాడ్ ఫాదర్’ సినిమా ఓటీటీ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుంది. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో మూవీ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ‘ గాడ్ ఫాదర్’ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను కూడ లాక్ చేసినట్లుగా సమాచారం. నవంబర్ 19 నుంచి గాడ్‌ ఫాదర్‌ ను ఓటీటీ లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. అయితే సినిమా విడుదలైన సమయంలో ఓటీటీ నిబంధనల ప్రకారం వీలైనంత త్వరగానే గాడ్ ఫాదర్ సినిమాను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తోందట నెట్ ఫ్లిక్స్ సంస్థ. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా నెగిటివ్ ఫలితం తర్వాత గాడ్ ఫాదర్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు.

ఈ సినిమాని మోహన్ రాజా డైరెక్ట్ చేయగా రామ్ చరణ్, ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి కొణిదల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. వాటికి మూవీ టీమ్ కూడా సమాధానం చెప్పింది. ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉన్నా కూడా తాము ఈ సినిమా చేశామని, సినిమా చేయాలనే ఉద్దేశంతోనే చేశామని తమకు కలెక్షన్స్ ప్రధానం కాదు అని సినిమా నిర్మాత కూడా చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.

ఈ సినిమాలో చిరంజీవి తో పాటు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటించారు. సత్యదేవ్ విలన్ పాత్రలో మెప్పించారు. అలాగే నయనతార, సునీల్, షఫీ, సముద్ర ఖని వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ‘లూసిఫర్’ సినిమా తో పోలుస్తూ పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ చేశారు. అయితే సినిమా విడుదల అయిన తర్వాత సినిమాకు మంచి స్పందన రావడంతో హిట్ టాక్ ను తెచ్చుకుంది. దర్శకుడు మోహన్ రాజా మలయాళం ‘లూసిఫర్’ నుంచి పాత్రలను తీసుకున్నా సినిమా మూల కథను మార్చి తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు తీయడంతో సినిమా మంచి వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. మరి నెట్ ఫ్లిక్స్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మహేష్ ఫ్యాన్స్‌కి జలక్.. SSMB 28 కొత్త రిలీజ్ డేట్.

సూపర్ స్టార్ మహేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. SSMB 28 సినిమా షూటింగ్ స్టార్ట్ చేయక ముందే వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ కానుందంటూ యూనిట్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసింది. ఈ మధ్యనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. తర్వాత మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లి తిరిగొచ్చేశారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ మూవీ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు.

కాగా.. SSMB 28 సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. నిజానికి ఏప్రిల్ 28న SSMB 28 రిలీజ్ చెప్పినప్పటికీ భారీ సినిమాలు పోస్ట్ పోన్ కావటంతో వరుసగా అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ మారతున్నాయి. మహేష్ చెప్పిన డేట్‌కే పవన్ కళ్యాణ్ పీరియాడిక్ మూవీ హరి హర వీర మల్లు వస్తుంది. మహేష్, త్రివిక్రమ్ మూవీ ఆగస్ట్ 9న రిలీజ్ అవుతుందని అంటున్నాయి సినీ సర్కిల్స్. ఇదే కనుక జరిగితే సమ్మర్‌లో మహేష్ స్పీడు చూడాలనుకున్న ఆయన అభిమానులకు నిరాశ తప్పేలా లేదు.

మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ వార్తలపై నిర్మాతలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది. సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం కోసం మహేష్ తన లుక్‌ని పూర్తిగా మార్చుకున్నాడు. సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నారు మహేష్.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh