Road Accident: రెండు బస్సులు ఢీ.. 12 మంది దుర్మరణం

Road Accident:

Road Accident: రెండు బస్సులు ఢీ.. 12 మంది దుర్మరణం

Road Accident :  ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు.

మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది.

ఆదివారం అర్థరాత్రి దాటాక.. దిగపహండి ప్రాంతానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో బెర్హంపూర్-తప్తహణి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

ఖండదేవులి గ్రామం నుంచి 27 మంది పెళ్లి బృందంతో వెళ్తున్న మీని బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించగా..వారిలో ఇద్దరు చిన్నారులున్నారు.  

అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎంతో ఆనందంగా కన్నా బిడ్డకు పెండ్లి చేయగా అనంతరం  ఆ తల్లిదండ్రులు   బంధువులు, స్నేహితులతో, పోరుగువారితో కలిసి నవ వధువును సాగనంపేందుకు వరుడికి ఇంటికి వెళ్లారు.

బిడ్డను అత్తింటివారికి అప్పజెప్పి సంతోషంగా తిరుగు ప్రయాణం అయ్యారు.

అంతా సవ్యంగా జరిగింది. ఇక హాయిగా ఇంటికి వెళదాం అనుకున్న ఆ తల్లిదండ్రులకు ఊహించని ఘటన ఎదురైంది.

ఎదురుగా వస్తున్న బస్సే వారి పాలిట మృత్యువుగా మారింది. కండ్లు మూసే తెరిచేలోపే అంతా జరిగిపోయింది.

అంతసేపు ముచ్చట్లతో గడిపిన వారంతా శవాలుగా క్షతగాత్రులుగా చెల్లాచెదరై రోడ్డుపై పడ్డారు.

ఈ ప్రమాదం  సోమవారం వేకువజామును ఒంటి గంట ప్రాంతంలో  జరిగింది.

ప్రమాద తీవ్రత ధాటికి రెండు బస్సులు పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. పెద్ద ఎత్తున అంబులెన్స్​లు కూడా అక్కడికి చేరుకున్నాయి.

గాయపడ్డవారిని ఎమ్‌కేసీజీ మెడికల్ కాలేజీ, దిగపహండి ఆస్పత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంలో కటక్ తరలించారు.

ప్రమాద ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం క్షతగాత్రులకు తక్షణ సాయం ప్రకటించారు. చికిత్స కోసం రూ.30 వేల చొప్పున మంజూరు చేశారు.

రెండు బస్సుల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh