AP – TS News : నేడు ఈ-ఆటోలను ప్రారంభించిన ఏపీ సీఎం

AP - TS News

AP – TS News : నేడు ఈ-ఆటోలను ప్రారంభించిన ఏపీ సీఎం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిపరిశుభ్రం గా  ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధృడ సంకల్పంలో భాగంగా చెత్తసేకరణ ఈ-ఆటోలను ప్రారంభించింది. ఈ ఆటోలను  గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. అలాగే చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు. ఒక్కో ఆటో విలువ రూ.4.10 లక్షలుకాగా, 500 కేజీల సామర్థ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం రూ.21.18 కోట్లను వెచ్చించింది. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేస్తారు.   అయితే మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ- ఆటోల’ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను స్వచ్ఛంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతుంది. అయితే ఇప్పటికే రూ. 72కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40లక్షల కుటుంబాలకు ప్రభుత్వం తడి, పొడి, హానికర వ్యర్థాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్ -1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను ప్రభుత్వం వినియోగిస్తోంది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్‌ టిప్పర్లను వినియోగిస్తోంది. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించింది.
అలాగే త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా 81 మున్సిపాలిటీల్లో రూ. 157 కోట్లతో 135 గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లు ప్రభుత్వం నిర్మిస్తుంది. పెద్ద, చిన్న మున్సిపాలిటీల్లో వీధులన్నీ శుభ్రంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh