శ్రేయాస్ అయ్యర్ తో పాటు గాయాలతో మెగా టోర్నీకి దూరమవుతున్న స్టార్ ప్లేయర్లస్ వీళ్ళే 

IPL 2023: శ్రేయాస్ అయ్యర్ తో  పాటు గాయాలతో మెగా టోర్నీకి దూరమవుతున్న స్టార్ ప్లేయర్లస్ వీళ్ళే

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో  మరి కొన్ని గంటలలో ప్రారంభం  కానున్న ఐపీఎల్ 2023 అయితే అభిమానులు ఈసారి ఐదుగురు స్టార్ ఆటగాళ్లను మిస్ అవుతున్నారు. ఈ డిఫెండింగ్ చాంపియన్స్ అయిన గుజరాత్ టైటాన్స్ నాలుగుసార్లు ట్రోఫీని సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్మధ్య జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. గాయాల కారణంగా ఈ ఐపీఎల్‌కు ఐదుగురు స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. వారెవరంటే?

ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లో ఆడతాడని అనుకున్నప్పటికీ వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా విశ్రాంతి కల్పించారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఆడతాడన్న వార్తలు కూడా వచ్చినప్పటికీ అవి నిజం కాదని తేలిపోయింది.

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్  గతేడాది డిసెంబరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఢిల్లీ నుంచి సొంతూరైన రూర్కీ వస్తుండగా అతడి కారు ప్రమాదానికి గురైంది. ఆపరేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దీంతో అతడి స్థానంలో ఢిల్లీ కేపిటల్స్ జట్టు డేవిడ్ వార్నర్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.

టీ20 క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్లలో బెయిర్‌స్టో ఒకడు. గతేడాది సెప్టెంబర్‌లో గోల్ఫ్ ఆడుతూ జానీ బెయిర్‌స్టో గాయాలపాలయ్యాడు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇంకా అతనికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వనందున తను ఐపీఎల్‌కు దూరమయ్యాడు. మడమ స్థానభ్రంశం చెందడంతోపాటు, విరిగిన కాలుకు ఆపరేషన్ చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు అతడి స్థానాన్ని మ్యాట్ షార్ట్‌తో భర్తీ చేసింది.

మరో వైపు కైల్ జేమీసన్ కూడా వెన్ను నొప్పి కారణంగా టోర్నమెంట్‌కు దూరం అవుతున్నాడు. ఈ మధ్యనే సర్జరీ కూడా అయ్యింది. ఇక జై రిచర్డ్సన్ కూడా గాయంతో మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరం అవుతున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ కూడా గాయంతో 2023 ఐపీఎల్‌కు దూరం అవుతున్నాడు.
ఐపీఎల్‌కు అతడు దూరం కావడంతో దక్షిణాఫ్రికా పేసర్ సిసంద మంగలను సీఎస్‌కే తీసుకుంది.

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో వెన్నునొప్పి కారణంగా శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. ఇది కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పెద్ద దెబ్బే. అయ్యర్ కూడా వెన్ను నొప్పి కారణంగానే జట్టుకు దూరమయ్యాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం స్టార్ బ్యాటర్ నితీశ్ రాణాను తీసుకోవడమే కాకుండా జట్టుకు అతడిని కెప్టెన్‌గా నియమించింది. మొత్తానికి ఐపీఎల్ 2023కి గాయాల కారణంగా పలు స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో ఆయా జట్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh