ఇంకా అప్పుడే విశాఖకు ఇదే ఫైనల్ : ఏపీ సీఎం

This is the final for Visakhapatnam: AP CM

YS Jagan: ఇంకా అప్పుడే విశాఖకు ఇదే ఫైనల్ : ఏపీ సీఎం

ఏపీ రాష్ట్ర పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉండబోతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని చెబుతున్న ఏపీ సీఎం జగన్ విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అన్నీ కుదిరితే మార్చి 22 ముఖ్యమంత్రి గృహప్రవేశం చేసే అవకాశం ఉందనే టాక్ వినిపించింది.

కానీ  ఉగాది రోజున విశాఖలో తన కార్యాలయం ఏర్పాటుచేయాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనెల 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో సీఎం బిజీగా ఉంటారంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

ఉగాది రోజు విశాఖలో సీఎం కార్యాలయం ప్రారంభించాలంటే అధికారులు అక్కడ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకే అసెంబ్లీ ముగిసిన తర్వాత ఏప్రిల్ మొదటివారంలో విశాఖకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు సీఎం జగన్‌. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కూడా విశాఖ రాజధాని అంశాన్ని ప్రస్తావించారు సీఎం. త్వరలోనే తాను విశాఖ నుంచి పాలన చేస్తానని చెప్పారు. దీనికి తగ్గట్లుగానే సీఎం క్యాంపు కార్యాలయం కోసం విశాఖలో ఇప్పటికే పోర్ట్ గెస్ట్ హౌస్‌ని సిద్ధం చేస్తున్నారు.

అయితే రాజదాని తరలిపులో ఇక ఆలోచించాల్సిన పనిలేదు జులైలో మనం విశాఖ వెళ్తున్నాం ఇదే ఫైనల్ ఇదే నా  నిర్ణయం అంటూ సీఎం జగన్ మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు. దీంతో 7స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలను గెలవాలంటూ సూచించారు.

అయితే ఏం తేడా వచ్చినా మంత్రివర్గంలో మార్పు తప్పదంటూ సీఎం జగన్ మంత్రులను హెచ్చరించారు. మీ పని తీరు గమనిస్తున్నా మీరు ఇకనైనా అలర్ట్ అవ్వండి అంటూ మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఏడుకి ఏడు ఎమ్మెల్సీలు గెలవాల్సిందేనంటూ పేర్కొన్న జగన్ పలు విషయాలపై మంత్రులకు క్లారిటీ కూడా ఇచ్చారు కాగా త్వరలో విశాఖ వెళ్తామని గతంలో ఢిల్లీలో సీఎం జగన్ అన్నారు విశాఖలో జరిగిన ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్లోనూ విశాఖే రాజధాని అంటూ జగన్ పేర్కొన్నారు. ఈ తరుణంలో విశాఖకు తరలివెళ్లే నెలను కూడా సీఎం జగన్ ఇప్పుడు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. 45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023-27 పారిశ్రామిక విధానానికి సైతం కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ముందుగా, స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ఏపీ బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజులపాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh