మళ్లీ విజృంభిస్తున్న కరోనా

corona virus :మళ్లీ విజృంభిస్తున్న కరోనా

దేశంలో   కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా పంజా విసురుతున్న సమయంలోనే కోవిడ్ మహమ్మారి కూడా ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు సిద్దం  అవుతోంది.  రోజురోజుకూ  క‌రోనా కేసుల పెరుగుతుండడంతో ప్ర‌జ‌ల్లో మ‌రోసారి భయాందోళన‌లు మొదలవుతున్నాయి.గతంలో కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం అతలాకుతం చేసిన విషయం అందరకి తెలిసిందే. కరోనా బారిన పడి ఎంతో మంది ప్రాణాలు విడిచారు. ఎన్నో కుటుంబాలు విచ్చినం అయ్యాయి . కొంత మంది మంది చికిత్స పొంది కోలుకున్నారు. అలాగే మరొకవైపు లాక్‌డౌన్‌ కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయి తీవ్ర అవస్థలకు పడ్డారు. ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. తినేందుకు తిండిలేక చాలా మంది పస్తులుండిపోయారు.

ఇప్పుడు కరోనా మళ్లీ ఇప్పుడు చాప క్రింది నీరు లాగా  విజృంభిస్తోంది. నాలుగు నెలల గ్యాప్‌ తర్వాత కేసులు మరింత  పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 800 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 841 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 5వేల 389కి చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు కరోనా మరణాలు కూడా రోజు రోజుకు పెరుగుతున్నాయి. జార్ఖండ్‌,మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా మరణం నమోదయ్యాయి. కేరళలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌లలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని గణాంకాలు పేర్కొన్నాయి.

కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌లో మొత్తం 4.46 కోట్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఓవైపు ఫ్లూ విజృంభిస్తోంది ఇంకోవైపు కరోనా ప్రళయం  జరుగుతుంది. దీనికి తోడు ఒకవైపు దేశవ్యాప్త వర్షాలు కలవరం రేపుతున్నాయి. వర్షాలు తగ్గితే అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉండడంతో కేంద్రం ప్రజలను హెచ్చరిస్తోంది. కరోనా నిబంధనలు అన్నీ పాటించాలంటోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా ఇమ్యూనిటీ అందరిలో ఉన్నా మరోసారి విజృంభించే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు నిపుణులు. కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకకు పరీక్షలు, చికిత్స, ట్రాకింగ్, టీకాల పంపిణీ పెంచాలని సూచించింది. కరోనా కేసుల కట్టడికి అవసరమైన అన్ని చర్యలు  రాష్ట్రాలు  తీసుకోవాలని స్పష్టం చేసింది. కొత్త కొత్త వైరస్‌లు వెంటాడుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తోంది కేంద్రం. ముందులాగే ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతోంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh