HYDERABAD: ఘోర అగ్ని ప్రమాదం

HYDERABAD

HYDERABAD: ఘోర అగ్ని ప్రమాదం

HYDERABAD: హైదరాబాద్ లోని కుషాయిగూడలో విషాదం చోటు చేసుకుంది. భవనంలో మంటలు చెలరేగి ముగ్గురు సజీవదహనమయ్యారు. టింబర్ డిపోలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న భవనానికి మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ భవనంలో నివసిస్తున్న దంపతులు, వారి చిన్న కుమారుడు మంటల్లో సజీవదహనమయ్యారు.

మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేష్ (35), సుమ (28), జోషిత్ (5)గా పోలీసులు గుర్తించారు. అయితే మరో చిన్నారి ఆచూకీ తెలియరాలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో నాలుగు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

HYDERABAD పోలీసులు తెలిపిన ప్రకారం కుషాయిగూడలోని ఆదిత్య టీమ్బర్ డిపోలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. మంటలు త్వరగా డిపో పక్కనే ఉన్న భవనానికి కూడా వ్యాపించాయి. ఆ డిపో ప్రక్కన ఉన్న భవనంలో ఆ ఫ్యామిలీ నివసిస్తున్నారు.   తెల్లవారుజామున 3:30 గంటలకు అగ్నిమాపక శాఖ మరియు డిఆర్ఎఫ్ బృందానికి అగ్నిమాపక కాల్ వచ్చింది మరియు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనకు సంబంధించిన కచ్చితమైన పరిస్థితులను తెలుసుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు.  ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన కుషాయిగూడ పోలీసులు ప్రస్తుతం సాక్షులు, ఆధారాల కోసం గాలిస్తున్నారు.

మరోవైపు HYDERABAD మల్లాపూర్ పారిశ్రామికవాడలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్ నెంబర్ 15లో ఉన్న పెయింట్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. పెయింటింగ్ కెమికల్స్ లో మంటలు చెలరేగాయి.  11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని యాజమాన్యం ప్రకటించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh