CM YS Jagan: రైతుకు అండగా

CM YS Jagan

CM YS Jagan: రైతుకు అండగా

CM YS Jagan: అన్నదాతకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. అకాల వర్షాలతో బాధపడుతున్న రైతుల వద్ద నుంచి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం పర్యటన ముగించుకొని తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తిరిగి రాగానే సీఎంఓ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, సహాయక చర్యలు, ఇతర అంశాలపై సీఎం జగన్ బుధవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  రాష్ట్రంలో అకాల వర్షాలు, పంట నష్టం పరిస్థితులపై సీఎం సమీక్ష చేపట్టారు.

సీఎం. అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తడిసిన ధాన్యం ఉన్న రైతుల వద్ద నుంచి వెంటనే ఈ ధాన్యాన్ని సేకరించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు .  అలాగే ఇప్పటికే కోసి వున్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.

అలాగే హార్వెస్టింగ్‌ చేసి ధాన్యం ఎక్కడా ఉన్నా సేకరించాలని ఆదేశించారు. వర్షాల బారి నుంచి పంటను కాపాడేందుకు చర్యలను మరింత ముమ్మరంగా చేయలన్నారు.కొనుగోలు కేంద్రాలు, ఆర్బీకేలు, రైతుల వద్ద కాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలన్నారు. ఎన్యుమరేషన్‌ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఎన్యుమరేషన్‌ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు.

సీఎం ఆదేశాల మేరకు ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చులకింద ప్రతి కలెక్టర్‌కూ ఒక కోటి రూపాయలు కేటాయించారు. ఇన్‌పుట్‌ సబ్సిడీని విడుదల చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు జగన్. ప్రస్తుతం వర్షాలు, పంట విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్ తద్వారా రైతులకు అవగాహన కల్పించే చర్యలను చేపడుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పొలాల్లో ఉన్న మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్‌ అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షాలు తగ్గగానే పంట నష్టపోయిన చోట రైతులకు అండగా నిలవడానికి సీఎం ఆదేశాల మేరకు విత్తనాలు పంపిణీచేస్తామని చెప్పారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh