AP Govt Employees Transfers: గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్

AP Govt Employees Transfers: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్

AP Govt Employees Transfers: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ట్రాన్స్‌ఫర్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ నెల 22 నుంచి 31వ వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. అయితే జూన్‌ 1 నుంచి మళ్లీ నిషేధం వర్తిస్తుంది.

రిక్వెస్ట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌లో బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఆర్థికశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

2023 ఏప్రిల్‌ 30 నాటికి ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తైన వారికి బదిలీ తప్పనిసరి. అలాగే 2023 ఏప్రిల్‌ 30 నాటికి ఒకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారికి రిక్వెస్ట్‌పై బదిలీకి అవకాశం ఉంటుంది.

ఉద్యోగుల అభ్యర్థన, పరిపాలన ప్రాతిపదికనే బదిలీలు ఉంటాయని మార్గదర్శకాల్లో ప్రభుత్వం తెలిపింది. ఈ బదిలీల్లో భార్యా భర్తలకు ప్రాధాన్యత ఇస్తారు.

ఒకసారి అవకాశం వినియోగించుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాతే బదిలీలకు అర్హులు. బదిలీలన్నింటినీ ఉద్యోగుల అభ్యర్థనగా పరిగణిస్తారు.. ప్రమోషన్‌పై ఉద్యోగి బదిలీ తప్పకపోతే బదిలీ చేసే చోట ఆ పోస్టు ఉండాలి.

Also watch

Congress: సొంతగూటికి చెరబోతున్న రాజగోపాల్‌ రెడ్డి

అంతేకాదు ఎలాంటి ఫిర్యాదులు, ఆరోపణలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు జరిగే బాధ్యత సంబంధిత శాఖాధిపతులపై ఉంటుందని ఆర్థిక శాఖ తెలిపింది.

అయితే  మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన తర్వాత.. ఈ నెల 18 నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు.

అలాగే ఐదేళ్లు పూర్తిచేసుకున్న హెచ్‌ఎంలకు, ఎనిమిదేళ్లు పూర్తయిన ఎస్జీటీ, పాఠశాల సహాయకులకు, దరఖాస్తు చేసుకున్న వారందరికీ వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేస్తారు.

ప్రమోషన్లు,బదిలీల పై టీచర్లతో చర్చించామన్నారు మంత్రి బొత్స. నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగానే బదిలీలు చేస్తామని.

గురువారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.  6,249 మంది ఎస్.జీటీ టీచర్ల లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తారు.

ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 679 ఎంఈవో  పోస్టులను హెడ్ మాస్టర్ లతో భర్తీ చేస్తారు. తోలుత సీనియర్లను బదిలీ చేసిన అనంతరం పదోన్నతులు కల్పిస్తారు.

డీఏ బకాయిలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి

టీచర్ల బదిలీకి 8 ఏళ్లు, హెడ్ మాస్టర్లకు 5 ఏళ్ల సర్వీస్ పరిగణలోకి తీసుకుంటారు. ఇవాళ పూర్తి మార్గదర్శకాలు వెలువడనున్నాయి.

1746 పీజీ టీచర్స్ రీ డిప్లాయిమెంట్ ప్రక్రియ కూడా శుక్రవారం నుంచే ప్రారంభిస్తామన్నారు. 9249 మంది ఎస్.జీటీ టీచర్లను బదిలీ చేస్తామని.

స్కూల్స్ ప్రారంభమయ్యేలోపే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉపాధ్యాయులను కోరారు.

ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ప్రక్రియకు అడ్జుపడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని.

ట్రాన్స్ ఫర్స్ పూర్తి చేసిన తర్వాతే ప్రమోషన్లు ఉంటాయన్నారు. అందరినీ ఒప్పించే బదిలీలు, ప్రమోషన్ల పై నిర్ణయం తీసుకున్నామన్నారు.

అయితే ముందు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లోని అన్ని ఖాళీలు, పోస్టులను భర్తీ చేసిన తర్వాత ఇతర ప్రాంతాల బదిలీలు చేపట్టాలి.

40 శాతం అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.. మానసిక స్థితి సరిగాలేని పిల్లలున్న ఉద్యోగులకు వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి బదిలీ.

అలాగే ఒకే చోట పనిచేసే కాలాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు 9 ఏళ్లకు పెంచారు. అంతేకాదు కారుణ్య నియామకాల్లో వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఉంటుంది.

కాగా, APలో ఎండల తీవ్రత నేపథ్యంలో వైద్య విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వాలని డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ బాబ్జి అన్ని మెడికల్ కాలేజీలను ఆదేశించారు.

10 నుంచి 15 రోజులు హాలిడేస్ ఇవ్వాలని ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ లో నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh