Pooja Hedge: మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయం

మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయం చెప్పిన పూజా హెగ్డే

Pooja Hedge: అతడు’, ‘ఖలేజా’ వంటి క్లాసిక్ సినిమాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో రూపొందుతోన్న మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ ‘ఎస్ఎస్ఎంబి 28′(వర్కింగ్ టైటిల్). టాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్.రాధాకృష్ణ (చిన‌బాబు) భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Pooja Hedge, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

ప్రస్తుతం Pooja Hedge కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన తొలిసారిగా నటిస్తోంది. మహర్షి (2019) తర్వాత మహేష్ బాబుతో కలిసి నటిస్తోంది. ఒక న్యూస్ చానల్ కు  ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ చాట్ లో ఈ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు పూజా స్పందిస్తూ షూటింగ్ మొదలైందని, బాగానే జరుగుతోందని చెప్పింది.

మహేష్ బాబుపై పూజా ఆసక్తికారమైన విషయం చెప్పింది ఈ మూవీ లో  మహేష్ బాబును కొత్త అవతారంలో చూడబోతున్నారు. నేను ఇంతకు ముందు చేసిన దానికంటే చాలా భిన్నంగా కనిపించడాన్ని మీరు చూడబోతున్నారు. తాను అభిమానించే మహేష్ బాబులోని ఒక క్వాలిటీని చెప్పమని అడగ్గా ‘ఆయన వాయిస్ మాడ్యులేషన్ పై ఆయనకు మంచి కంట్రోల్ ఉందని నేను అనుకుంటున్నాను. అది అతనితో గొప్ప విషయం.” ‘ఎస్ ఎస్ ఎంబీ 28’లో మహేష్ బాబుతో పాటు పూజా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. 2024 జనవరి 13న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన లుక్ కు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రివీల్ చేసి అందర్నీ షాక్ కి గురి చేశారు. ఇదిలా ఉంటే కేకేబీకేజే విషయంలోనూ Pooja Hedge ఉత్సాహంగా ఉంది. ఇది హిందీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడానికి సహాయపడుతుందని, మాస్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh