తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల లోగోను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం (మే 22న) ఆవిష్కరించారు. ఈ లోగోను సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హరీశ్‌రావుతో కలిసి సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు.

కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంస్కృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు. తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల లోగోను తయారు చేశారు.

తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2 నుంచి 21 రోజుల పాటు వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో ఉత్సవాల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు మంత్రులు జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్రం కోసం అమరులైన వారిని స్మరించుకునేందుకు ఒక రోజును ప్రత్యేకంగా మార్టియర్స్‌ డేగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. అమరుల స్తూపాలను పుష్పాలతో, విద్యుత్‌ దీపాలతో అలంకరించి, గ్రామ గ్రామాన అమరవీరులకు నివాళులర్పించాలన్నారు.

జూన్ 2న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. విద్యుత్తు, వ్యవసాయంతోపాటు సాగు నీరు సహా ప్రతి రంగంలో దేశానికే ఆదర్శంగా ప్రగతిని నమోదు చేసుకుంటూ పోతున్నదని.. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లె పల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని అన్నారు.తెలంగాణ  రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప సందర్భం. ఒకప్పుడు అవమానాలకు, అపోహలకు, అవహేళనలకు గురైన తెలంగాణ ఇప్పుడు అభివృద్ది, చైతన్యంతో చూసేవారి కళ్లు కుట్టేలా రాష్ట్ర పగతి ఉందని.

ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా పాల్గొన్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh