ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చిన ఈడీ

Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చిన ఈడీ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇప్పటివరకు మూడుసార్లు విచారణ జరపటం తెలిసిందే. ఈ మూడు దఫాల్లో మొత్తం 27 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. ప్రతి అంశాన్ని నమోదు చేసినట్లుగా చెబుతున్నారు. ఆమె ఈడీ విచారణకు హాజరైన ప్రతిసారీ కవితను అరెస్ట్  చేస్తారా లేకుంటే. కవిత సేఫ్‌గా తిరిగి ఇంటికొస్తారా అనేదానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.తిరిగి వచ్చే సమయంలో మరోసారి విచారణకుహాజరు కావాల్సి ఉంటే. ఈ మొయిల్ ద్వారా సమాచారం అందిస్తామని ఆ సమయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే విచారణ ఉంటుందా? లేదా? అన్న విషయంపై మాత్రం స్పష్టత రావటం లేదు. మళ్లీ విచారణ ఉంటే ఈ మొయిల్ ద్వారా సమాచారం అందిస్తామన్న విషయాన్ని ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె న్యాయవాది సోమా భరత్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే కవిత  ఈడీకి సమర్పించిన మొబైల్స్ కొత్తవా..? లేకుంటే పాతవా..? అనే దానిపై కూడా చర్చ జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత ఫోన్ల చుట్టూనే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ జరుగుతోందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ మొబైల్స్‌లో ఏముంది? అనేది ఆసక్తికరంగా మారింది

అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. అది ఏంటి అనుకుంటున్నారా? తాము కవిత అందించిన మొబైల్ ఫోన్ల ను తెరిచేందుకు సిద్దమయ్యామని లేఖలో తెలిపారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొంది. కవిత తరపున ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వెళ్లనున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత మొబైల్‌ను మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ స్టేట్మెంట్, బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను తన న్యాయవాది సోమా భరత్‌ ద్వారా ఈడీకి పంపారు. తరువాత రెండోరోజు కవిత విచారణకు హాజరైన క్రమంలో కొన్ని మొబైల్ ఫోన్స్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మొబైల్ ఫోన్లను సీల్డ్ కవర్‌లో మీడియాకు చూపించిన విషయం తెలిసిందే.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh