మహిళా దినోత్సవం రోజే ఆడబిడ్డ‌కు తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్

India's star cricketer becomes father to baby girl

తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్:

భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్, తాన్యా దంపతులకు బుధవారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్లో భారత జట్టులో ఉన్న ఉమేశ్ తన కుమార్తె పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా  ఫ్లాట్ ఫామ్ గా  ప్రకటించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఉమేశ్ చివరిసారిగా 2021 లో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు తన కుటుంబంలోకి కొత్త రాక గురించి వార్తలను పంచుకున్నాడు.

ఇటీవల ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో ఉమేశ్ బౌలర్గా కీలక పాత్ర పోషించి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన రివర్స్ స్వింగ్ను ప్రదర్శించి కేవలం 12 పరుగులకే ఆరు వికెట్లు ను తీశాడు.కాగా  కూతురు పుట్టిందన్న  ఉమేశ్ యాదవ్‌కు అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. మహిళా దినోత్సవం రోజు ఉమేశ్ ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇటీవలే ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్(74) అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌తో బిజీగా ఉన్న ఉమేశ్ యాదవ్ ఇంకా తన కూతుర్ని చూడలేదు. మార్చి 9న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టీమిండియా నాలుగో టెస్టు ఆడనుంది. ఇప్పటికే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్కు అర్హత సాధించిన ఆతిథ్య జట్టు తమ జోరును కొనసాగించి సిరీస్ను డ్రా చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కించుకోవాలంటే భారత్ చివరి టెస్టులో తప్పక గెలవాలి. న్యూజిలాండ్, శ్రీలంక మ్యాచ్ ఫలితంపై ఓటమి ఆధారపడి ఉంటుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న చివరి టెస్టుకు ఇరు దేశాల అధినేతలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ హాజరుకానున్నారు. 100,000 మంది ప్రేక్షకులు హాజరయ్యే ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది.

ఇది కూడా చదవండి: 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh