Pushpa 2: పుష్ప 2 టీమ్‌కు హైకోర్టు షాక్.. లాభాల్లో వాటా కోసం పిల్ దాఖలు!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” సినిమా విడుదలైనప్పటి నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా, హైకోర్టులో మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలవడం నిర్మాతలకు ఊహించని షాక్‌గా మారింది.

ఈ పిటిషన్‌ను న్యాయవాది నరసింహారావు దాఖలు చేశారు. పుష్ప 2 భారీ లాభాలు సంపాదించిందని, ఆ లాభాల్లో ఓ భాగాన్ని జానపద కళాకారుల పెన్షన్ కోసం వినియోగించాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ విషయంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు.

పిటిషనర్ ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం “పుష్ప 2” సినిమా బెనిఫిట్ షోల నిర్వహణకు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఈ సాయంతోనే భారీ లాభాలు వచ్చాయని ఆయన వాదిస్తున్నారు. అందువల్ల, ఆ లాభాల్లో కొంత భాగాన్ని జానపద కళాకారులకు కేటాయించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైకోర్టు ఈ కేసును విచారిస్తే, పుష్ప 2 చిత్ర నిర్మాతలు తమ లాభాల వివరాలను బయటపెట్టాల్సిన అవసరం రావొచ్చు. ప్రభుత్వ మద్దతుతో వచ్చిన ఆదాయాన్ని కళాకారుల సంక్షేమానికి వినియోగించాలనే కోణంలో ఈ కేసు కొనసాగుతుందా లేదా అనేది చూడాలి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh