KCR Addicts : యాసంగి ఉత్పత్తులను కనీస

KCR Addicts :

KCR Addicts : యాసంగి ఉత్పత్తులను కనీస మద్దతు ధర ప్రకటించిన ముఖ్యమంత్రి

KCR Addicts : అకాల వర్షాలతో నష్టపోయిన రాష్ట్రంలోని లక్ష మందికి పైగా జొన్నల రైతులకు భారీ ఊరటనిస్తూ, వారి యాసంగి ఉత్పత్తులను కనీస

మద్దతు ధర (ఎంఎస్‌పి) చెల్లించి 100 శాతం కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రకటించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీఎస్‌ మార్క్‌ఫెడ్‌ని నియమిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం రఘునందన్‌రావు శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు.

దీని ప్రకారం, రబీ 2022-23 సీజన్‌లో పండించిన 65,499 మెట్రిక్ టన్నుల జొన్న (హైబ్రిడ్)ను రాష్ట్ర పూల్‌లో MSP కింద మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది.

జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లేదా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సిడిసి) నుండి రూ.

219.92 కోట్ల రుణ సదుపాయాన్ని పొందేందుకు రాష్ట్ర మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్క్‌ఫెడ్ ద్వారా పొందే రుణ సదుపాయానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది.

ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, గద్వాల్‌ జిల్లాల్లోని జొన్న రైతులకు వరంగా మారనుంది.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీఎస్ మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ కొనుగోళ్లు చేపట్టాలని వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు శుక్రవారం జీవో KCR Addicts :  జారీ చేశారు.

ప్రస్తుతం రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది.

ఎప్పుడు వర్షాలు కురుస్తాయో చేతికి వచ్చిన పంటలు దెబ్బతింటాయనే ఆందోళన నెలకొంది.

ఒకసారి అనావృష్టితో పంటలు దెబ్బతింటుండగా మరోసారి అతివృష్టితో పంట నష్టం జరుగుతోంది…మొత్తం మీద

ఏదో ఒక కారణంతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈసారి మాత్రం పరిస్థితులు రివర్స్‌ KCR Addicts : అయ్యాయి.

వాస్తవానికి వేసవి కాలంలో ఎండలకు పంటలు ఎండిపోవడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఎండల మాట పక్కకు పెడితే వర్షాలకు పంటలు దెబ్బతింటు

న్నాయి.  వేసవి కాలంలో అకాల వర్షాలు రైతులను కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే విడతల వారీగా కురిసిన అకాల వర్షాలతో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి.

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల పరిధిలో 33 శాతానికి పైగానే పంటలు వర్షార్పణమయ్యాయి. తొలి విడత కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది.

ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం అందించనున్నారు. వాటిని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

రెండవ విడత వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలు ప్రభుత్వానికి పంపిస్తున్నారు.

మూడవ విడతకు సంబంధించి అధికారులు క్షేత్ర స్థాయిలో నష్టానికి సంబంధించిన లెక్కలు వేస్తున్నారు.

Leave a Reply