నేడు నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎంభేటీ

 cm Jagan: నేడు నిర్మలా సీతారామన్‌తో ఏపీ సీఎం  భేటీ

డిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిగురువారంనాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ తో  జగన్ భేటీ అయ్యారు.  ఏపీకి రావాల్సిన  నిధులు, బకాయిలపై  కేంద్ర మంత్రి  నిర్మలా సీతారామన్ తో  సీఎం జగన్  చర్చిస్తున్నారని సమాచారం. ఏపీకి  రావాల్సిన నిధులు, బకాయిలపై  సీఎం జగన్  కేంద్ర ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్ తో  చర్చించారు. ఆర్ధిక సంవత్సరం ముగింపు  నేపథ్యంలో  ఉపాధి హామీ  , పోలవరం నిధుల  విడుదలపై   కేంద్ర మంత్రితో  జగన్  చర్చించారని  సమాచారం.

అలాగే బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాత్రి 10.45 గంటల సమయంలో అమిత్‌షాతో సమావేశం అయ్యారు సీఎం జగన్‌. దాదాపు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీ అభివృద్ధితోపాటు పలు విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందులో విభజన హామీలు, పెండింగ్ బకాయిలపై చర్చ జరిగింది. బుధవారం ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రుల్ని కలిసిన సంగతి తెలిసిందే. పెండింగ్‌ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్ సుధీర్ఘంగా ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధితో పాటు రాజకీయ అంశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం.

రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనే సీఎం జగన్ ప్రధానంగా ప్రధాని మోడీతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల అదేవిధంగా ఏపీకి రావాల్సిన నిధులు తదితర అంశాలపై మోడీకి వివరించారు.

దీంతోపాటు విభజన సమస్యలు, మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికలకు సీఎం జగన్ ఇప్పటి నుంచే సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ శ్రేణులను కూడా సంసిద్ధం చేస్తున్నారు.అలాగే  రాష్ట్రానికి  సంబంధించిన  13 అంశాలపై  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు  జగన్  వినతి  పత్రం సమర్పించారు. ఇవాళ ఉదయం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో  జగన్ సమావేశమయ్యారు.

అమిత్‌షాకు సీఎం జగన్‌ నివేదించిన అంశాలు ఇవే..
* రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగానష్టపోయింది. అశాస్త్రీయ విభజన కారణంగా ఆర్థికంగా, ఆదాయాలపరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాలనుంచి కాపాడేందుకు, రక్షణగా విభజన చట్టంలో కేంద్రం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. పార్లమెంటు సాక్షిగా కూడా ఈ హామీలు ఇచ్చింది. విభజన జరిగి 9 సంవత్సరాలు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టిసారించమని కోరుతున్నాను.
* పోలవరం ప్రాజెక్టును మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరుతున్నాను.
* అనూహ్య వరదల కారణంగా డయాఫ్రంవాల్‌ దెబ్బతింది. డయాఫ్రంవాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.202౦ కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనావేసింది. ఈ డబ్బును వెంటనే విడుదలచేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
* రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను.
* పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. ఈ మొత్తానికి వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను.
* తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌వారీ నిబంధనలను సడలించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
* పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అదిస్తే జాప్యాన్ని నివారించవచ్చు.
* 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరుతున్నారు.
* రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కన్నా ముందున్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడుకుందన్న కారణంతో ఇప్పుడు ఆంక్షలు విధించారు. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను.
* తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను.
* రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి.ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
* కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్‌ కాలేజీలతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరుతున్నాను. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని కేంద్ర హోంశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.

అయితే 15 రోజుల వ్యవధిలోనే  మరోసారి   సీఎం జగన్   ఢిల్లీ టూర్  రాజీకియా టూర్ హాట్ టాపిక్ మారింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh