Texas Mall Shooting: టెక్సాస్లోని మాల్లో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ యువతి మృతి
Texas Mall Shooting: హైదరాబాద్ నుంచి కొన్నాళ్ల క్రితమే ఉన్నత చదువుల కోసం టెక్సాస్కు వెళ్లిన ఐశ్వర్య మే 6, 2023న జరిగిన టెక్సాస్ మాల్ కాల్పుల్లో హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల ఐశ్వర్య అనే యువతి, మరో ఎనిమిది మందితో కలిసి ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా వాణిజ్య న్యాయస్థానాల సముదాయంలో పనిచేస్తున్న అదనపు జిల్లా జడ్జి తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె. టెక్సాస్లోని అలెన్ ప్రీమియం ఔట్లెట్స్ మాల్లో ఐశ్వర్య తన స్నేహితులతో కలిసి షాపింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. తాడికొండ ఐశ్వర్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాటికొండ ఐశ్వర్య మరణించారు. తాటికొండ ఐశ్వర్య మరణించినట్లు తెలుగు సంఘాలు ధ్రువీకరించాయి. తాటికొండ ఐశ్వర్య కొత్తపేటలో నివాసం ఉంటారు. రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ తాటికొండ నర్సిరెడ్డి కుమార్తెనే తాటికొండ ఐశ్వర్య. ఐశ్వర్య మృదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు కుటుంబ సభ్యులతో పాటు అమెరికా తెలుగు సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి.
Also, Watch This
అమెరికాలో కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. టెక్సాస్లోని ఓ మాల్కు శనివారం మధ్యాహ్నం 3:30 కారులో వచ్చిన దుండగుడు జనంపైకి ఇష్టారాజ్యంగా కాల్పులకు తెగబడ్డాడు. దాంతో అక్కడి వారంతా భయంతో కేకలు వేస్తూ రక్షణ కోసం పరుగులు తీశారు. కాల్పుల శబ్దాలు, జనం కేకలతో అక్కడ విధుల్లో ఉన్న ఓ పోలీసు అప్రమత్తమై సాయుధున్ని కాల్చి చంపాడు.అప్పటికే దుండగుని కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో కన్నుమూశారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
గవర్నర్ గ్రెగ్ అబాట్ కాల్పులను “చెప్పలేని విషాదం” అని అన్నారు. మరియు స్థానిక అధికారులకు ఏదైనా సహాయం అందించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రెసిడెంట్ బిడెన్కి కాల్పుల గురించి వివరించామని మరియు స్థానిక అధికారులకు మద్దతు ఇచ్చామని వైట్ హౌస్ ప్రకటించింది.
అమెరికాలో ఈ సంవత్సరం (2023)లో కనీసం 198 సామూహిక కాల్పులు జరిగినందున, ఈ విషాద సంఘటన యునైటెడ్ స్టేట్స్లో ఒక వివిక్త కేసు కాదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.