తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఢిల్లీ పర్యటన అనంతరం నేరుగా జిల్లాకు చేరుకున్న ఆయన, కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, “2034 వరకు ఈ పాలమూరు బిడ్డే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు.. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025
ఈ వ్యాఖ్యలపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ, “రాబోయే పదేళ్లు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముఖ్యమంత్రి ఎన్నిక జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చే ప్రయత్నాలను నిజమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు” అని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. ఇంతలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ ట్వీట్, తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.