CM KCR Delhi Tour: నేడు డిల్లీకి సీఎం కేసీఆర్ పయనం

CM KCR Delhi Tour

CM KCR Delhi Tour: నేడు డిల్లీకి సీఎం కేసీఆర్ పయనం రేపు బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

CM KCR Delhi Tour: నేడు(బుధవారం)  బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. దిల్లీ పర్యటనలో భాగంగా మే 4వ తేదీన ఆయన వసంత్ విహార్‌లో శాశ్వత బీఆర్ఎస్ జాతీయ పార్టీ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.  దిల్లీలో  కేసీఆర్ ఎంత కాలం ఉంటారనేది ఎటువంటి సమాచారం లేదు.బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముందు కేసీఆర్ యాగం నిర్వహించే అవకాశం ఉంది.తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ రెండు రోజులుగా దిల్లీలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి (భారాస) కేంద్ర కార్యాలయం (తెలంగా ణ భవన్‌) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఢిల్లీ వసంత్‌ విహా ర్‌లో 1,150 చదరపు మీటర్ల స్థలంలో మొత్తం ఐదు అంత స్తు ల భవనాన్ని నిర్మించారు. ఈ నెల 4వ తేదీ గురువారం నూ తన కార్యాలయంలో భారాస అధినేత, తెలం గాణ సీఎం కేసీ ఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా కార్యాల యా న్ని ప్రారంభించనున్నారు. ఈ నేపధ్యం లో  మరి కొంతమంది మంత్రులు, ప్రజా ప్రతినిధులు మంగళవారం సాయంత్రం ఢిల్లీ బయ లుదేరి వెళ్లారు. గురువారం నుంచి భారాస జాతీయ కార్యక లాపా లన్నీ ఈ నూతన కార్యాలయం నుంచే నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. కా ర్యాలయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పార్టీ నేతలు కూర్చుని సమావేశాలు, చర్చా గోష్ఠులు జరుపుకునే విధంగా సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల భారాస అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు ఢిల్లీ వచ్చిన సందర్భంలో మీడి యా సమావేశాలను జరిపేందుకు కూడా ప్రత్యే క ఏర్పాట్లు- చేసినట్టు సమాచారం. భారాస చీఫ్‌ కేసీఆర్‌ ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్టీ జాతీయ నేతలు వివిధ రాష్ట్రాలకు చెందిన భావ సారూప్యత గల పార్టీల నేత లతో సమాలోచనలు జరుపుకునేందు కు వీలుగా ప్రత్యేక సమావేశ మందిరాన్ని ఏర్పాటు- చేశారు.

రేపు బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

ఢిల్లీ లో కొత్తగా ప్రారంభిస్తున్న భారాస జాతీయ కార్యాల యంలో అధ్యక్షుడికి ప్రత్యేకంగా గదిని సిద్ధం చేశారు. కార్యా లయ ప్రారంభానికి బుధవారం ఒక్కరోజే గడువు ఉండటంతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌ పనులను వేగవంతం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం కేసీ ఆర్‌ కోసం ప్రత్యేక గదితో పాటు మొత్తం 18 రూమ్‌లు, కాన్ఫ రెన్స్‌ హాలు ఉండేలా నిర్మించారు. అతిథుల కోసం రెండు సూట్‌ రూమ్‌లు కేటాయించారు. వివిధ కార్యక్రమాలు, పనుల నిమిత్తం పార్టీ కార్యాలయానికి వచ్చే వారి కోసం ప్రత్యే కంగా క్యాంటీన్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు.

ఈ నెల 4 గురువారం సుమూహర్తం ఉండటంతో అదే రోజు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్‌ శ్రేణు లు ఏర్పాట్లు-చేస్తున్నారు. 4వ తేదీ మధ్యాహ్నం 1.05 గంట లకు ముహూ ర్తం ఖరారు చేశారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వసం త్‌ విహార్‌లోని కార్యాలయానికి చేరుకొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన ను న్నట్లు- పార్టీ వర్గాలు తెలిపాయి. పండితులు హోమం, వాస్తు పూజలు నిర్వహించనున్నారు. ప్రారం భోత్సవం అనంతరo  సుమారు గంట సేపు కొత్తగా నిర్మించిన కార్యాలయంలో సీఎం కేసీ ఆర్‌ గడపనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్య క్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలతో పాటు- ఢిల్లీ నగరానికి చెందిన భారాస కీలక నేతలు, ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, ముఖ్యులకు ఆహ్వా నాలు పంపించినట్టు సమాచారం.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh