దేశంలో భారీగా పెరుగుతున్న కరొన కేసులు

Carona cases : 5 నెలల తర్వాత 2 వేలు దాటిన కరొన కేసులు

భారతదేశంలో కరోనా మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తుంది.కరొన కేసులు  రోజురోజుకీ అంతకు అంతా  కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలో భయ  ఆందోళన కలుగుతున్నాయి. గడిచిన  24 గంటల్లో భారత దేశంలో కరోనా కేసులను చూసినట్లయితే 2,151 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు క్రమంగా భారీగా పెరుగుతుండటం ఆందోళనగ్గా మారింది. గత ఐదు నెలలుగా దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం ఇదే మళ్లీ తొలిసారి అని కేంద్రం పేర్కొంది. గత అక్టోబర్ నుండి ఇంత భారీగా కేసులు నమోదైన దాఖలాలు లేవు.
ఇదే సమయంలో ఏడుగురు కోవిడ్‌కు బలయ్యారు. తాజా కేసులతో కలిపి దేశంలోని యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 11,903కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 1200 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. తాజా కోవిడ్ మరణాల్లోమూడు మహారాష్ట్రలో సంభవించగా ఒకటి కర్ణాటకలో నమోదైంది.

కరోనా డైలీ పాజిటివిటీ రేటు మన దేశంలో 1.51 శాతంగా నమోదు కాగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.53 శాతంగా ఉంది. తాజా కేసులు కలుపుకుంటే దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు దాటింది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.03 శాతంగా ఉన్నాయి. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది.

దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,66,925కి చేరుకుంది. కోవిడ్ మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 11,336 కరోనా టీకాలు వేశారు. ఇప్పటి వరకూ 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. అందులో 95.20 కోట్లు రెండో డోసులు కాగా 22.86 కోట్ల బూస్టర్ డోసులున్నాయి.

సాధారణ ప్రజానీకానికి కోవిడ్ బూస్టర్ డోసులను సిఫారసు చేయడం లేదని టీకాల వల్ల ప్రయోజనం పరిమితంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వెల్లడించింది. ఇప్పటికే వ్యాక్సిన్లు వేయించుకొని బూస్టర్ డోస్ కూడా తీసుకున్న వారికి మరో డోస్ తీసుకున్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేదని కానీ ఫలితం తక్కువగానే ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో టీకా నిపుణులు తెలిపారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh