ప్రాణ భయంతో గడుపుతున్న ఏపీ విద్యార్థులు : నారా లోకేష్

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 91వ రోజు కొనసాగుతోంది. ఈ నేపధ్యం లో మణిపూర్ ఘటన పై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. మణిపూర్‌లో క‌నిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయిన నేప‌థ్యంలో అక్కడ ఎన్ఐటీలో చ‌దువుతున్న ఏపీ విద్యార్థులు ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని బిక్కుబిక్కుమంటున్నార‌ని, వారిని త‌క్షణ‌మే రాష్ట్రానికి తీసుకురావాల‌ని టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో ఏర్పడిన ఘర్షణల‌తో అత్యవ‌స‌ర ప‌రిస్థితి విధించారు. ఇప్పటికే ప‌ర‌స్పర దాడుల్లో 54 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. చాలా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. హింసాత్మక ఘటనలను నియంత్రించడానికి కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో అక్కడున్న తెలుగు విద్యార్థుల ప‌రిస్థితి ఆందోళ‌న‌లో ప‌డింది.

ఆ విద్యార్థులను తక్షణమే రాష్ట్రానికి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. మణిపుర్‌లో తలెత్తిన ఘర్షణలతో అక్కడ అత్యవసర పరిస్థితి విధించారని  ఇప్పటికే పరస్పర దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారని లోకేశ్‌ అన్నారు. చాలా జిల్లాల్లో కర్ఫ్యూ అమలవుతోందని చెప్పారు. వివిధ యూనివర్సిటీలు, ఎన్ఐటీల్లో వందలాది మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉన్నారని  భద్రత విషయమై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వారిని తక్షణమే రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని లోకేశ్‌ డిమాండ్ చేశారు.

అయితే ఇప్పటికే తెలంగాణ విద్యార్థులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సురక్షితంగా తీసుకొచ్చిందని. ఏపీ విద్యార్థులు మాత్రం బిక్కుబిక్కుమంటూ మణిపుర్‌లో ప్రాణభయంతో గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం ఉన్న నేపథ్యంలో ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్లని విద్యార్థులు ఎలా సంప్రదించగలరని లోకేశ్ ప్రశ్నించారు. కాల్‌ సెంటర్ల పేరుతో కాలయాపన చేయొద్దన్నారు. ఈ విషయంలో సీఎం జగన్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని మణిపుర్‌ ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర విద్యార్థులను రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh