Hyderabad : తెలంగాణలో మరో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

Hyderabad

Hyderabad : తెలంగాణలో మరో ఇంటర్ స్టూడెంట్ సూసైడ్

Hyderabad : ప్రస్తుతం తెలంగాణలో స్టూడెంట్ల వరుస ఆత్మహత్యలు కలవరం పెడుతున్నాయి.  హైదరాబాద్ లోని నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని మణికొండలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి శివకుమార్ సూసైడ్ చేసుకున్నాడు. అయితే కొద్దిరోజుల్లో ఇంటర్ హెగ్జామ్స్ జరగనుండడంతో ఒత్తిడితోనే శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శివకుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు.

కాగా రాష్ట్రంలో ఏడాదిగా సగటున 350 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రధానంగా పరీక్షల ఒత్తిడి, చదువు భారంతోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. గత 20 రోజుల్లో ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే విద్యార్థులు సూసైడ్ చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh