Rajiv Gandhi: రాజీవ్ గాంధీ హత్యకు ముందు ఏం జరిగింది..? అసలు ప్లాన్ ఏమిటి..?

1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో జరిగిన రాజీవ్ గాంధీ హత్య దేశాన్ని కుదిపేసిన సంఘటన. ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆ రోజున ఓ సభ కోసం అక్కడికి వెళ్లారు. ఆయన అక్కడికి వెళ్లడం, ఆపై పేలుడు జరగడం అన్నీ ప్లాన్ ప్రకారమే జరిగాయని తేలింది.

శ్రీ పెరంబుదూర్‌లో జరిగిన సభకు పెద్ద ఎత్తున జనసమ్మతి ఏర్పడింది. కాంగ్రెస్ నేత మరకతం చంద్రశేఖర్ తరఫున ప్రచారం చేసేందుకు రాజీవ్ వెళ్లారు. అయితే, భద్రతాపరంగా కొన్ని హెచ్చరికలు ఉన్నా స్థానికంగా అవి పట్టించుకోకపోవడం, బారికేడ్లు సరిగ్గా లేకపోవడం ప్రమాదానికి దారితీసింది.

గంధపు దండతో యువతి

సభలో లతా కణ్నన్ అనే మహిళ, తన కూతురు కోకిలను స్టేజికి తీసుకొచ్చింది. ఈ క్రమంలో గంధపు దండతో ఓ యువతి కూడా లోపలికి వచ్చింది. ఆమెనే రాజరత్నంగా గుర్తించారు. ఈమె LTTE సభ్యురాలు. గంధపు మాల వేసే టైంలో రాజీవ్ తల వంచిన క్షణం.. రాజరత్నం కిందకి వంగి ఉన్నట్టుగా నటించి తన మీద బాంబును పేల్చింది. ఒక్కసారిగా శబ్దంతో భూమి కంపించింది. రాజీవ్ గాంధీతో పాటు మొత్తం 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఎందుకు చంపారు..?

శ్రీలంకలో తమిళ వేర్పాటువాదులైన LTTEపై భారత ప్రభుత్వం 1987లో ప్రత్యేక బలగాలను పంపింది. ఈ సమయంలో తమిళులపై దాడులు జరగడంతో LTTE కక్ష పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర పన్నినట్లు తర్వాతి దర్యాప్తులో బయటపడింది.

Leave a Reply