Tollywood: ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు

Tollywood

Tollywood:ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు శరత్ బాబు

Tollywood: టాలీవుడ్ పరిశ్రమలో వరుసగా సినీ ప్రముఖులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Tollywood లోని బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. తాజాగా సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బెంగళూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నారు.

బెంగళూరు ఆసుపత్రిలో ఆయన కొంత వరకు కోలుకున్నారని ఆయన సన్నిహితులు ప్రకటించారు. ఐసీయూ నుంచి సాధారణ విభాగానికి శరత్ బాబును మార్చినట్టు తెలుస్తోంది. అయితే బెంగళూరు హాస్పిటల్ లో ఉండగానే మరోసారి ఆయన పరిస్థితి విషమించినట్టు తెలిసింది. దాంతో శరత్ బాబును బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం శరత్ బాబు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో ఆయనను ఐసీయూ నుంచి జనరల్ రూంకు షిఫ్ట్ చేశారు. ఈ విషయం తెలిసి శరత్ బాబు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులతో పాటు అభిమానులు ప్రార్థి్స్తున్నారు.  పలువురు తారలు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శిస్తున్నట్టు తెలుస్తోంది.

అలాగే 1973లో రామరాజ్యం సినిమాతో Tollywood సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శరత్ బాబు కన్నె వయసు, పంతులమ్మ, అమెరికా అమ్మాయి లాంటి చాలా చిత్రాల్లో నటించి, మెప్పించారు. దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లో నటించారు శరత్ బాబు. తెలుగు సినిమాలతో మొదలు పెట్టి.. తమిళ, కన్నడ మలయాళ సినిమాల్లో శరత్ బాబు లీడ్ క్యారెక్టర్లు చేశారు.. అలా దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించిన ఆయనకు మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకోవడం విశేషం.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh