AP Politics: సిఎం పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి

Y S Jagan

Y S Jagan: సిఎం పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి

Y S Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Y S Jagan కుట్రలు, కుతంత్రాలు  ఒక్కొకటిగా బయటపడుతున్నాయని  మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.  పల్నాడు జిల్లాలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ రెడ్డి ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చారని అంతేగాక, కోడి కత్తి వివేక హత్య కేసు  ఇలా అనేక దుర్మార్గాలతో మోసాలతో సీఎం సీట్ లో కూర్చున్నారని చెప్పారు.

అయితే సానుభూతి పొందడం కోసమే కోడి కత్తి డ్రామా ఆడారని, కోడి కత్తి కేసులో ఎన్ఐఏ వాస్తవాలు బయటపెట్టడంతో ప్రజలు ఛీ కొడుతున్నారని ప్రత్తిపాటి చెప్పారు. కోడి కత్తితో సానుభూతి పొందలేకపోవడంతో పీకే ఇచ్చిన మరో ఐడియానే వివేక హత్య అని ఆరోపించారు.

ఎవరిని చంపైనా, ఏమి చేసైనా సానుభూతి పొంది ఎన్నికల్లో గెలవాలన్నదే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని చెప్పారు. సుప్రీంకోర్టు వివేక హత్య కేసుకు సంబంధించి ఏప్రిల్ 30  వరకు డెడ్ లైన్ విధించడంతో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం బయటకు వస్తుందని అన్నారు.

నిన్న అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని, అలాగే రేపోమాపో అవినాశ్ రెడ్డి కూడా అరెస్టు కావచ్చని ప్రత్తిపాటి చెప్పారు. ఇది తాడేపల్లి ప్యాలెస్ కు తాకుతుందని అన్నారు. అసలు కుట్రదారులను గుర్తించకుండా ఈ కేసు ముగింపు పలికే అవకాశం లేదని తెలిపారు.

తప్పకుండా వివేక హత్య కేసు వెనక ఉన్న అసలు సూత్రధారులు రాబోయే రోజులలో బయటకు వస్తారని చెప్పారు.

మూడున్నర సంవత్సరాలుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా సహజ వనరులను కొల్లగొట్టి వేలకోట్లు దోచుకున్నారని ఆరోపించారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు ఇసుక మట్టి మద్యం మైనింగ్ మాఫియాతో రాష్ట్రాన్ని కొల్లగొట్టారని చెప్పారు. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు వేసుకునే స్థాయికి సీఎం జగన్ దిగజారారని అన్నారు.

స్టిక్కర్లు వేసి Y S Jagan మా నమ్మకం అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రత్తిపాటి నిలదీశారు. ప్రజా విశ్వాసం కోల్పోయినY S Jagan స్టిక్కర్ల సీఎంగా మిగిలిపోతారని చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచి 175 స్థానాలతో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలని ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. Y S Jagan దుర్మార్గపు ఆలోచనలు అక్రమ కేసులతో సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చిందని చెప్పారు.

మొత్తానికి  రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు అంటూ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లరావ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే  సాగర్ డ్యాంలో వాటర్ ఉంటే ఎందుకు పొలాలకి నీళ్లు వదలలేదు కుడి కాలువ ఎందుకు వదల్లేదు గతంలో సాగర్లో కొద్దిగా నీరు ఉన్న చివర పొలాలకు సైతం నీళ్లు వదినా ఘనత తెలుగుదేశం పార్టీది.

నీళ్లు వదలండి అని రైతులు ధర్నా చేస్తే అక్రమంగా అరెస్టు చేయటం మంచి పద్ధతి కాదు రైతులుపై పెట్టిన కేసులు మాఫీ చేసి వారిని విడుదల చేయాలి లేదంటే ఎస్పీ ఆఫీసుని జిల్లా నాయకులు అందరం కలిసి ముట్టడించడానికి వెనకడుగు వెయ్యము అంటూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh