వీడు మామూలు పిల్లాడు కాదు.. 14 ఏళ్ల వయసులో రికార్డులు కొల్లగొట్టిన వైభవ్ సూర్య వంశీ!

ఇండియన్ క్రికెట్‌ను షేక్ చేస్తున్న పసిపిల్లాడు పేరు వైభవ్ సూర్య వంశీ. వయసు కేవలం 14 ఏళ్లు. కానీ ఆటలో చూపిస్తున్న ఫెర్ఫార్మెన్స్ మాత్రం సీనియర్ ప్లేయర్లను కూడా మట్టికరిపిస్తోంది. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ బాదిన ఈ బుడతడు, ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో IPL చరిత్రలో నిలిచిపోయే రికార్డులు సృష్టించాడు.

సచిన్ తర్వాత ఇప్పుడు వైభవ్ పేరు మారుమ్రోగుతోంది

ఇంతవరకు చిన్న వయసులో క్రికెట్‌లో గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. కానీ ఇకపై ఆయన సరసన నిలవబోయే పేరు వైభవ్ సూర్య వంశీ. మొదటి మ్యాచ్‌లోనే తన టాలెంట్‌ను చూపించిన ఈ చిన్నోడి ఆట రెండో మ్యాచ్‌లో మాత్రం స్టేడియాన్ని కదిలించేసింది. 35 బంతుల్లోనే 101 పరుగులు చేసి, 11 సిక్సులు, 7 ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

వైరల్ అయిన 10వ ఓవర్

కరీమ్ జనత్ వేసిన పదో ఓవర్‌లో వైభవ్ 6,4,6,4,4,6 వంటి సీక్వెన్స్‌తో విరుచుకుపడి సెంచరీకి పునాది వేసాడు. తర్వాతి ఓవర్‌లో మరో సిక్స్ కొట్టి శతకం పూర్తి చేశాడు. ఈ ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 210 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలోనే ఛేదించింది.

వైభవ్ సూర్య వంశీ సాధించిన రికార్డులు

టీ20 క్రికెట్‌లో 50, 100 మార్కులు దాటి చేసిన అత్యంత పిన్న వయసు భారత క్రికెటర్ (14 ఏళ్లు 32 రోజులు)

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్ (35 బంతులు)

ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ (మొదటిది క్రిస్ గేల్ – 30 బంతులు)

ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ సిక్సులు కొట్టిన ఇండియన్ (11 సిక్సులు – మురళీ విజయ్‌తో సమానంగా)

ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడు

ఈ రికార్డులు చూస్తుంటే క్రికెట్‌కు మరో భవిష్యత్తు స్టార్ సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే వైభవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Leave a Reply