ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో టీమిండియా ఉత్కంఠభరితమైన విజయం సాధించింది. లండన్లోని ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. సిరీస్ను 2-2తో సమం చేసిన ఈ విజయం పట్ల క్రికెట్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది.
A thrilling end to a captivating series 🙌#TeamIndia win the 5th and Final Test by 6 runs
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE
#ENGvIND pic.twitter.com/9ybTxGd61A
— BCCI (@BCCI) August 4, 2025
భారత విజయానికి ప్రధాన కారణంగా నిలిచినవాడు పేసర్ మహమ్మద్ సిరాజ్. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ను కట్టడి చేశాడు. చివరి రోజు ఇంగ్లాండ్ విజయానికి కేవలం 35 పరుగులు అవసరం కాగా.. భారత్ బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంగ్లాండ్ను ఆలౌట్ చేశారు.
ఈ విజయంతో భారత్ తప్పకుండా ఓడిపోతుందన్న ఊహాగానాలను తిప్పికొట్టింది. సీనియర్ ఆటగాళ్లు లేకపోవడం, కొత్త కెప్టెన్సీతో జట్టులో అనేక మార్పులు రావడం వల్ల టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. మూడు మ్యాచ్లు పూర్తయ్యే సరికి భారత్ 1-2తో వెనుకబడింది. అయితే చివరికి ఆఖరి టెస్ట్లో అద్భుతంగా పోరాడి సిరీస్ను సమం చేసింది.
For his relentless bowling display and scalping nine wickets, Mohd. Siraj bags the Player of the Match award in the 5th Test 👏👏
Scorecard ▶️ https://t.co/Tc2xpWNayE#TeamIndia | #ENGvIND | @mdsirajofficial pic.twitter.com/GyUl6dZWWp
— BCCI (@BCCI) August 4, 2025
ఈ మ్యాచ్ టీమిండియాకు గౌరవాన్ని తెచ్చింది, యువ ఆటగాళ్లపై నమ్మకాన్ని బలపరిచింది. ముఖ్యంగా సిరాజ్ ప్రదర్శన ఈ విజయాన్ని చిరస్థాయిగా మార్చింది.