Shubman Gill: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో చెత్త రికార్డు నమోదు చేసిన శుభమన్ గిల్..!

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు చేదు ఆరంభం ఎదురైంది. కెప్టెన్‌గా శుభమన్ గిల్ తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసినప్పటికీ, జట్టు మాత్రం ఓటమి పాలైంది. దీంతో గిల్ తన ఖాతాలో ఓ అనుచితమైన రికార్డును వేసుకున్నాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్‌ల నుంచి తప్పుకోవడంతో శుభమన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ.. అతనితో ఐదు టెస్టుల సిరీస్‌ను ప్రారంభించింది. కానీ మొదటి టెస్ట్‌లో టీమిండియా కేవలం 5 వికెట్ల తేడాతో ఓడిపోవడం గిల్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది.

గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసినా, జట్టు ఓడిపోవడం అతడిని దిలీప్ వెంగ్‌సర్కార్‌, విరాట్ కోహ్లీ సరసన నిలిపింది. 1987లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెంగ్‌సర్కార్ కెప్టెన్‌గా 102 పరుగులు చేసినా టీమ్ ఓడిపోయింది. అలాగే 2014లో అడిలైడ్‌ టెస్టులో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు చేసినా టీమిండియా 48 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓడింది.

ఇప్పుడు గిల్ కూడా వారి సరసన చేరి, కెప్టెన్‌గా తొలి టెస్ట్ సెంచరీ చేసినప్పటికీ ఓటమి చూసిన మూడో భారత కెప్టెన్‌గా నిలిచాడు.

Leave a Reply