Shruti Haasan: చెన్నై ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న శృతి హాసన్.. స్టేడియంలో భావోద్వేగం..!

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది. చెపాక్ మైదానంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై టీమ్ ఓడిపోవడంతో స్టేడియంలోనే కళ్లలో కన్నీళ్లతో కనిపించినవారిలో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆమె మరెవరో కాదు.. శృతి హాసన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ను చూడటానికి భారీగా అభిమానులు చెన్నై స్టేడియానికి తరలిరాగా, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ధోనికి మద్దతుగా స్టేడియానికి వచ్చిన శృతి హాసన్ మ్యాచ్ ఫలితంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. చెన్నై ఓటమి చూసి ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. బ్రెవిస్ 42 పరుగులతో టాప్ స్కోరర్ కాగా, మాత్రే 30, హుడా 22, జడేజా 21 పరుగులు చేశారు. ధోనీ, కుర్రాన్, దూబే పెద్దగా రాణించలేదు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా, కమ్మిన్స్, ఉనాద్కత్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం 155 పరుగుల లక్ష్యాన్ని ఎస్‌ఆర్‌హెచ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇషాన్ కిషన్ (44), కమిందు మెండిస్ (32 నాటౌట్) కీలకంగా రాణించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా, ఖలీల్, అన్షుల్, జడేజా చెరో వికెట్ తీశారు.

ఓటమితో బాధపడిన చెన్నై అభిమానుల్లో శృతి హాసన్ ఉండటం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటన మరోసారి ధోనీ టీంకు ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో నిరూపించింది.

Leave a Reply