ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలవలేకపోయినా.. పంజాబ్ కింగ్స్ను టేబుల్ టాప్లో నిలబెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. మూడు వేర్వేరు జట్లను ఫైనల్ వరకు తీసుకెళ్లిన ఘనత శ్రేయస్కి మాత్రమే చెల్లింది. ఇది ఆయన సారధ్యంలోని ఆటకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.
గత సంవత్సరం కోలకత్తా నైట్ రైడర్స్కు టైటిల్ అందించిన శ్రేయస్.. ఈసారి పంజాబ్ కెప్టెన్గా తన హిస్టరీని మరోసారి చూపించాడు. కొలకత్తా నుంచి రిలీజ్ అయిన తర్వాత షారుక్ ఖాన్ తప్పు చేశాడనే విమర్శలతో పాటు, పంజాబ్ ఎంపికను చాలా మంది ప్రశంసించారు. ఆ నమ్మకాన్ని శ్రేయస్ పూర్తిగా నిలబెట్టుకున్నాడు.
పంజాబ్ను ఫస్ట్ టైమ్ ఐపీఎల్ ఫైనల్కు చేర్చిన శ్రేయస్, 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, 2024లో కోల్కతా నైట్ రైడర్స్కు కూడా ఫైనల్ తలుపులు తీయించాడు. మూడు వేర్వేరు జట్లను టైటిల్ పోరుకు చేర్చిన ఏకైక కెప్టెన్గా శ్రేయస్ పేరు చరిత్రలో నిలిచిపోయింది.
He gave it his all, but still fell a little short! 🤏 👏
HE DESERVES ALL THE LOVE AND RESPECT! ❤️#ShreyasIyer #RCBvsPBKS #IPL2025 pic.twitter.com/EeUrYzEJBG
— OneCricket (@OneCricketApp) June 3, 2025
ఫైనల్లో బెంగళూరుతో జరిగిన పోరులో ఓటమి ఎదురైనా, రన్ రేట్ ఆధారంగా పంజాబ్ టేబుల్ టాప్లో నిలవడం విశేషం. దీనికి ప్రధాన కారణం శ్రేయస్ బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీలో చూపిన స్థిరత్వం.
ఈ సీజన్ మొత్తంలో శ్రేయస్ ఆట అద్భుతంగా నిలిచింది. యువ ఆటగాళ్లను ఒక తాటిపైకి తెచ్చి, మంచి జట్టుగా మలిచాడు. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్పై 41 బంతుల్లో 87 పరుగులు బాదిన శ్రేయస్, తన ఇన్నింగ్స్తో మ్యాచ్ గెలిస్తే ఎలా ఉంటుందో చూపించాడు.
అత్యంత విజయం సాధించిన ఐపీఎల్ కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలతోపాటు ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ పేరు కూడా నిలబడుతుంది. ధోనీ, రోహిత్లు ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించగా, శ్రేయస్ మూడు వేర్వేరు జట్లకు ఫైనల్ ఛాన్స్ ఇచ్చాడు. ఇది సాధించడమే ఓ గొప్ప విశేషం.
ఈసారి ట్రోఫీ గెలుచుకోలేకపోయినా.. శ్రేయస్ అయ్యర్ మాత్రం తన కెప్టెన్సీ, బ్యాటింగ్తో రాణించి అభిమానుల హృదయాల్లో గెలిచాడు.