IND vs ENG: ధోనీ రికార్డు బద్దలైంది.. చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. SENA దేశాలు (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా వికెట్ కీపర్-బ్యాటర్‌గా పంత్ ఘనత సాధించాడు.

|ఇప్పటివరకు ఈ దేశాల్లో పంత్ 27 టెస్టుల్లో 38.80 సగటుతో 1,746 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు ఉన్నాయి. అంతకుముందు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ (1,731 పరుగులు – 32 మ్యాచుల్లో) పేరిట ఉండగా, పంత్ ఇప్పుడు అతడిని అధిగమించాడు.

అంతేకాకుండా టెస్ట్ క్రికెట్‌లో 3,000 పరుగుల మార్క్‌ను చేరిన రెండో భారత వికెట్ కీపర్‌గా కూడా పంత్ నిలిచాడు. ఈ ఘనతను ధోనీ తర్వాత సాధించిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. 76వ ఇన్నింగ్స్‌లోనే పంత్ ఈ మైలురాయిని తాకగా, ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ తర్వాత వేగంగా ఈ రికార్డును అందుకున్న రెండో వికెట్ కీపర్‌గానూ నిలిచాడు.

అత్యంత వేగంగా టెస్ట్‌ల్లో 3,000 పరుగులు చేసిన వికెట్ కీపర్లు:

ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 63 ఇన్నింగ్స్‌లు

రిషబ్ పంత్ – 76 ఇన్నింగ్స్‌లు

ఆండీ ఫ్లవర్ – 78 ఇన్నింగ్స్‌లు

కుమార్ సంగక్కర – 78 ఇన్నింగ్స్‌లు

రిషబ్ పంత్ రాబోయే ఇన్నింగ్స్‌లలో తన శైలితో ఇంకా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశముంది.

Leave a Reply