బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, పాట్నా విమానాశ్రయంలో 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఐపీఎల్లో కేవలం 35 బంతుల్లో సెంచరీ కొట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వైభవ్ మోదీ పాదాలను తాకి ఆశీర్వాదం పొందాడు. ఈ సందర్భాన్ని ప్రధాని స్వయంగా తన X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
PM Narendra Modi meeting Vaibhav Suryavanshi and his family. ❤️pic.twitter.com/k5uTIhCCk4
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2025
వైభవ్ ప్రదర్శనకు దేశమంతా అబ్బురపడుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ 18లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ యువ ఆటగాడు 7 మ్యాచ్ల్లో 252 పరుగులు చేశాడు. అనుభవజ్ఞులైన బౌలర్లకు సైతం చుక్కలు చూపించిన అతడి బ్యాటింగ్ స్టైల్ ప్రస్తుతం వైరల్గా మారింది. 35 బంతుల్లో సెంచరీ కొట్టి ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
At Patna airport, met the young cricketing sensation Vaibhav Suryavanshi and his family. His cricketing skills are being admired all over the nation! My best wishes to him for his future endeavours. pic.twitter.com/pvUrbzdyU6
— Narendra Modi (@narendramodi) May 30, 2025
విమానాశ్రయంలో జరిగిన ఈ సమావేశానికి వైభవ్ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. యంగ్ టాలెంట్ను ప్రోత్సహించే విధంగా ప్రధాని మోదీ వారిని అభినందించారు. “వైభవ్ క్రికెట్ నైపుణ్యాన్ని దేశం మెచ్చుకుంటోంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా” అని మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు.
ఈ టీనేజ్ క్రికెటర్ను కలిసిన ప్రధాని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. క్రికెట్ అభిమానులు, సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా వైభవ్ను అభినందిస్తున్నారు. చిన్న వయసులోనే పెద్దవారిని వెనక్కి నెట్టి నిలబడ్డ వైభవ్ దేశానికి గర్వకారణంగా మారాడు.