ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ మార్చి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు బాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రముఖ గాయకులు, అంతర్జాతీయ మ్యూజిక్ బ్యాండ్లు స్టేజ్పై సందడి చేయనున్నారు. క్రికెట్ అభిమానులు మాత్రమే కాకుండా, సినీ ప్రేమికులకు కూడా ఈ వేడుక ఓ స్పెషల్ ట్రీట్ కానుంది.
ఈ వేడుకలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, విక్కీ కౌశల్, శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ వంటి స్టార్లు పాల్గొనే అవకాశం ఉంది. బాలీవుడ్ తారల ప్రదర్శనలు ఈ కార్యక్రమానికి మరింత గ్లామర్ తెచ్చి పెడతాయి. ప్రత్యేకంగా సల్మాన్ ఖాన్ తన రాబోయే సినిమా “సికందర్” ప్రమోషన్ కోసం స్టేజ్పై ఓ స్పెషల్ సెగ్మెంట్లో పాల్గొననున్నట్లు సమాచారం.
ఇంతే కాదు, ఈ వేడుకలో సంగీత ప్రదర్శనలు కూడా అదిరిపోనున్నాయి. ప్రముఖ గాయకులు అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్, కరణ్ ఆజ్లా తమ గానామృతంతో ప్రేక్షకులను అలరించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన అమెరికన్ పాప్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది. వన్ రిపబ్లిక్ బ్యాండ్, కరణ్ ఆజ్లా, దిశా పటాని కలిసి “టెల్ మీ” పాటను ప్రదర్శించనుండటం మ్యూజిక్ లవర్స్కు హైలైట్ కానుంది.
Royal Challenge Packaged Drinking Water Moment of the Day 📸
The age-old gully game debate: Who should take strike? 😅😉#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/n7enKdJbAC
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 19, 2025
ఐపీఎల్ ప్రారంభోత్సవం తర్వాత జరిగే తొలి మ్యాచ్ అభిమానుల్లో ఇప్పటికే భారీ ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. షారుఖ్ ఖాన్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు యజమానిగా ఉన్న నేపథ్యంలో ఆయన తన జట్టును ప్రోత్సహించేందుకు హాజరవుతారని భావిస్తున్నారు.
ఈ సంవత్సరం ఐపీఎల్ మొత్తం 74 మ్యాచ్లతో ప్రేక్షకులకు మజా పంచనుంది. 23 వేదికలపై జరిగే ఈ టోర్నమెంట్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ లాంటి జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మే 25న జరగనుంది.
ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ఇది వినోదం, గ్లామర్, స్ఫూర్తిని కలిపిన మాస్ ఫెస్టివల్. మార్చి 22న ఈ భారీ ఈవెంట్తో ఐపీఎల్ 2025 ఉత్సాహానికి తెరలేవనుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ గ్రాండ్ ఓపెనింగ్ ఇప్పుడు మరింత అద్భుతంగా ఉండనుంది.
Squad goals?
More like swag goals! 😎💜
Get your jersey today. pic.twitter.com/ilIqg2dS7c— KolkataKnightRiders (@KKRiders) March 19, 2025