ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు, టీ20 సిరీస్ను తమ పేరుపై లిఖించుకుంది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్లు పూర్తవగా.. భారత జట్టు 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇది ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళల జట్టుకు మొదటి టీ20 సిరీస్ విజయం, అందుకే ఈ గెలుపును చరిత్రాత్మక విజయంగా క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
నాలుగో టీ20 మ్యాచ్ హైలైట్స్:
గత రాత్రి మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు రాణించడంతో వారు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 126 పరుగులకే పరిమితమయ్యారు. బౌలింగ్లో రాధా యాదవ్, శ్రీ చరణి, దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ కౌర్ మంచి ప్రదర్శన చూపారు.
For her strong performance with the ball and two well judged catches, Radha Yadav is the Player of the Match 🏆#TeamIndia win the 4th T20I by 6 wickets and take an unassailable lead of 3-1 ✨
Scoreboard ▶️ https://t.co/QF3qAMduOx#ENGvIND | @Radhay_21 pic.twitter.com/2CpqSRibYq
— BCCI Women (@BCCIWomen) July 9, 2025
127 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు దిగిన భారత జట్టు సునాయాసంగా విజయం సాధించింది.
బ్యాటింగ్లో:
స్మృతి మంధన – 32 పరుగులు
షెఫాలి వర్మ – 31 పరుగులు
జెమిమా రోడ్రిగ్స్ – 24* పరుగులు
హర్మన్ ప్రీత్ కౌర్ – 26 పరుగులు
రాణించడంతో భారత జట్టు 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ సిరీస్లో 5వ మరియు చివరి టీ20 మ్యాచ్ జూలై 12న జరగనుంది. అయితే ఇప్పటికే సిరీస్ భారత్ వశం కావడంతో, చివరి మ్యాచ్లో జట్టు మరింత ప్రయోగాలకు దిగే అవకాశం ఉంది.