World Championship: వరల్డ్ ఛాంపియన్‌షిప్ స్పీడ్ స్కేటింగ్‌లో భారత్ కు రెండు బంగారు పతకాలు

చైనాలో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ స్పీడ్ స్కేటింగ్‌లో భారత్ అథ్లెట్లకు మరో రెండు స్వర్ణ పతకాలు సొంతమయ్యాయి. సీనియర్ పురుషుల 1000 మీటర్ల ఈవెంట్‌లో ఆనంద్ కుమార్, జూనియర్ 1000 మీటర్ల స్ప్రింట్‌లో క్రిష్ శర్మ పతకాలు సాధించారు.

సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్‌లో చరిత్ర
ఆనంద్ కుమార్ భారత్ తరఫున మొట్టమొదటి ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలిచారు. 22 ఏళ్ల ఈ స్పీడ్‌స్టర్ 1000 మీటర్ల సీనియర్ స్ప్రింట్‌ను 1:24.924 సమయంతో పూర్తి చేసి, భారతదేశం తరఫున తొలి వరల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈక్రీడలో ముందుగా 500 మీటర్ల స్ప్రింట్‌లో వెల్ కుమార్ కాంస్యం సాధించారు. 43.072 సెకన్లలో పూర్తి చేసిన ఈ విజయంతో భారతదేశం మొట్టమొదటి సీనియర్ వరల్డ్ పతకాన్ని గెలుచుకుంది.

జూనియర్ 1000 మీటర్ల స్ప్రింట్‌లో క్రిష్ శర్మ స్వర్ణం
మరో వైపు, జూనియర్ 1000 మీటర్ల స్ప్రింట్‌లో క్రిష్ శర్మ కూడా స్వర్ణ పతకం గెలుచుకున్నారు. దీంతో భారత్ తరఫున చాంపియన్‌షిప్‌లో అద్భుతమైన డబుల్ విజయాన్ని సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో చెంగ్డులో జరిగిన ప్రపంచ క్రీడల్లో కూడా క్రిష్ కాంస్యం సాధించారు.

Leave a Reply