ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తాజాగా తీసుకున్న ఓ షాకింగ్ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అయ్యింది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్గా పంపించిన హార్దిక్ డెసిషన్పై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 203 పరుగుల భారీ టార్గెట్ నిలిపింది. ముంబై బ్యాటింగ్ ఆరంభంలోనే కొన్నిచోట్ల తడబడినా, సూర్యకుమార్ యాదవ్ – తిలక్ వర్మ భాగస్వామ్యం గేమ్ను నిలబెట్టేలా కనిపించింది. అయితే సూర్య అవుట్ అయిన తర్వాత తిలక్ నెమ్మదిగా ఆడుతుండటంతో హార్దిక్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.
Batting at 25 off 23 in the run chase, #TilakVarma retired himself out to make way for Mitchell Santner! 🤯
Only the 4th time a batter has retired out in the IPL!
Watch LIVE action ➡ https://t.co/nH2UGjQY0t #IPLonJioStar 👉 #LSGvMI, LIVE NOW on Star Sports 1, Star Sports 1… pic.twitter.com/NJ0C0F8MvL
— Star Sports (@StarSportsIndia) April 4, 2025
19వ ఓవర్ చివరి బంతికి తిలక్ స్ట్రైకు చేరుకోగానే, హార్దిక్ అతన్ని రిటైర్డ్ అవుట్గా పంపించి శాంట్నర్ను పంపించాడు. మ్యాచ్లో ఇంకా 7 బంతులు మిగిలి ఉండగా, బౌండరీలు అవసరమైన టైంలో అలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. తిలక్ 23 బంతుల్లో 25 పరుగులు చేసి క్రీజులో స్థిరంగా ఉన్నా, అతనికి బంతులు ఎదుర్కోవటం కష్టమవుతోందని హార్దిక్ మ్యాచ్ అనంతరం చెప్పాడు.
అయితే ఇది క్రికెట్ హిస్టరీలోనే అత్యంత వివాదాస్పద డెసిషన్లలో ఒకటిగా నిలవనుంది. తిలక్ ఉంటే ఓ బిగ్ హిట్టర్గా ఆఖరి ఓవర్లో సిక్సర్లు కొడితే మ్యాచ్ ముంబైకి వెళ్లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. శాంట్నర్ కేవలం రెండు పరుగులకే పరిమితమవగా, హార్దిక్ కూడా ఓ సిక్సర్తో కలిపి 9 పరుగులకే పరిమితమయ్యాడు. ఫలితంగా ముంబైకి 12 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.
Harbhajan Singh and Hanuma Vihari raise questions and express their disappointment over Tilak Varma being retired out 👀🗣️
Do you agree with them? 🤔#IPL2025 #TilakVarma #LSGvMI #Sportskeeda pic.twitter.com/jvRVs89fZY
— Sportskeeda (@Sportskeeda) April 4, 2025
ఈ డెసిషన్ తర్వాత సోషల్ మీడియాలో హార్దిక్ మీద విమర్శల వర్షం కురుస్తోంది. “కెప్టెన్గా ప్రెషర్ హ్యాండిలింగ్ లోపించిందా?”, “తిలక్ వర్మను అవమానించారా?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.