టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రముఖ నటి లక్ష్మీ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ధోనీతో తనకు సంబంధం ఉందన్న రూమర్లే తన సినిమా కెరీర్ను దెబ్బతీశాయని, ఇప్పటికీ ఆ ఆరోపణలు తనను వదలడంలేదని ఆమె వాపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లక్ష్మీ, “నా పిల్లలు భవిష్యత్తులో ఈ విషయంపై నన్ను అడిగితే ఏమని సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఓ రూమర్ వల్ల జీవితమే మారిపోయింది!
ధోనీతో తనకు డేటింగ్ ఉందని వచ్చిన ఊహాగానాలు అప్పట్లో మీడియాను షేక్ చేశాయి. “ఈ రూమర్ వల్లే నాకు అవకాశాలు తగ్గిపోయాయి. సినీ ఇండస్ట్రీలో నా ఇమేజ్ మారిపోయింది. ఇప్పటికీ అది ఒక మచ్చలా మారింది. ఇలాంటి పిచ్చి వార్తలు రాయడం ఆపండి” అంటూ ఆమె తీవ్రంగా స్పందించారు.
ధోనీ – లక్ష్మీ రాయ్ రిలేషన్ గతంలో వైరల్
2007లో టీ20 వరల్డ్కప్ తర్వాత ధోనీతో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, సౌత్ హీరోయిన్ లక్ష్మీ రాయ్లతో డేటింగ్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. వీరిని పబ్బులలో, పార్టీలలో కలిసి కనిపించిన ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీపికాతో పాటు లక్ష్మీ రాయ్తో కూడా ధోనీకి దగ్గరి సంబంధం ఉందని మీడియాలో రిపోర్ట్స్ రావడంతో ఆమె కెరీర్పై ప్రభావం చూపిందని తాజాగా లక్ష్మీ చెబుతోంది.
ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. ఏదేమైనా, లక్ష్మీ చేసిన ఈ కామెంట్లు మళ్లీ పాత చర్చను తెరపైకి తీసుకొచ్చాయి.