టీమిండియాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకొని జట్టులోని నలుగురు సహాయక సిబ్బందికి ఉద్వాసన పలికింది. వీరిలో గౌతమ్ గంభీర్ సన్నిహితుడు అభిషేక్ నాయర్ కూడా ఉన్నారు. జట్టులో అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తున్న అభిషేక్ను, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్, మసాజర్ను బీసీసీఐ తప్పించింది.
बॉर्डर-गावस्कर ट्रॉफी में खराब प्रदर्शन पर BCCI ने अब जाकर एक्शन लिया है।बल्लेबाजी और फील्डिंग कोच को बर्खास्त कर दिया है।
एक सवाल है। पैवेलियन में बैठे बल्लेबाजी कोच की अगर गलती है तो मैदान में खेल रहे बल्लेबाज की क्या कोई गलती नहीं है?
स्टार खिलाड़ियों और मुख्य कोच से इतना… pic.twitter.com/IDiLmWjdLI
— Mukesh Mathur (@mukesh1275) April 17, 2025
గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభిషేక్ నాయర్ 2024 జూలైలో అసిస్టెంట్ కోచ్గా నియమితులయ్యాడు. అయితే ఇటీవల ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ పేలవంగా ఆడిన నేపథ్యంలో డ్రెస్సింగ్ రూమ్లోని అంతర్గత విషయాలు లీక్ కావడం, ఆ సిరీస్ ఆటతీరు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక అభిషేక్ నాయర్ పదవీకాలం ముగియడంతోనే అతడిని తొలగించామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఫీల్డింగ్, ఫిట్నెస్ విభాగాల్లో తీవ్ర అసంతృప్తితో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషణ.
🚨 BCCI CHANGE COACHING STAFF. 🚨
– The BCCI set to remove Abhishek Nayar from the coaching duties. (Abhishek Tripathi). pic.twitter.com/qqlqrB77i5
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 17, 2025
ప్రస్తుతం టీమిండియా జట్టు జూన్ 20న ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్కు సిద్ధమవుతోంది. అందుకు ముందు కొత్త కోచింగ్ సిబ్బందిని నియమించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఈ నెల 20లోపు కొత్త సపోర్ట్ స్టాఫ్ను ఎంపిక చేస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ పరిణామాలతో జట్టులో వాతావరణం మారనుందని, గంభీర్కి ఇది తొలి పరీక్ష అవుతుందని విశ్లేషకుల అభిప్రాయం.