ఆసియా కప్ 2025లో పాల్గొననున్న టీమిండియా జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈసారి జట్టుకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగనుండగా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. గిల్ ఇప్పటికే టెస్టు జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఈ జట్టులో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కి అవకాశం దక్కలేదు. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేశ్ శర్మ ఎంపికయ్యారు. అలాగే వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్, యాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ద్ కృష్ణ స్టాండ్బై ఆటగాళ్లుగా ఉన్నారు.
🚨 #TeamIndia's squad for the #AsiaCup 2025 🔽
Surya Kumar Yadav (C), Shubman Gill (VC), Abhishek Sharma, Tilak Varma, Hardik Pandya, Shivam Dube, Axar Patel, Jitesh Sharma (WK), Jasprit Bumrah, Arshdeep Singh, Varun Chakaravarthy, Kuldeep Yadav, Sanju Samson (WK), Harshit Rana,…
— BCCI (@BCCI) August 19, 2025
ఆసియా కప్ 2025 – టీమిండియా జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్)
శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్)
జితేశ్ శర్మ (వికెట్కీపర్)
సంజు శాంసన్ (వికెట్కీపర్)
హార్దిక్ పాండ్యా
శివమ్ దూబే
అభిషేక్ శర్మ
తిలక్ వర్మ
అక్షర్ పటేల్
జస్ప్రీత్ బుమ్రా
అర్ష్దీప్ సింగ్
కుల్దీప్ యాదవ్
రింకూ సింగ్
వరుణ్ చక్రవర్తి
హర్షిత్ రాణా
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
The most awaited Indian squad for the Asia Cup 2025 is out! 🇮🇳📜
BCCI announced their 15-member squad with Suryakumar Yadav leading the side in UAE. 🏆🎯#India #SuryakumarYadav #T20Is #Sportskeeda pic.twitter.com/D5YLBugQIf
— Sportskeeda (@Sportskeeda) August 19, 2025
టోర్నమెంట్ వివరాలు:
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు జరగనుంది. ఈసారి అన్ని మ్యాచ్లు టీ20 ఫార్మాట్ లోనే నిర్వహించబడతాయి.
భారత్ తొలి మ్యాచ్ – సెప్టెంబర్ 10
భారత్ vs పాకిస్థాన్ – సెప్టెంబర్ 14
భారత్ vs ఒమన్ (లీగ్ చివరి మ్యాచ్) – సెప్టెంబర్ 19
