ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ జిల్లాకు సంబంధించి ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. జిల్లాను ఇకపై వైఎస్సార్ కడప జిల్లాగా పిలవాలని చంద్రబాబు సర్కార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన తర్వాత ఆయన స్వస్థలమైన కడప జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేరుకు గౌరవం ఇస్తూ “వైఎస్సార్ కడప”గా మార్చింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ పేరులో “కడప” పదాన్ని తొలగిస్తూ “వైఎస్సార్ జిల్లా” గా మళ్లీ నామకరణం చేసింది. దీనిపై అప్పట్లో ప్రజల నుంచి గట్టి విమర్శలు వచ్చాయి. జిల్లా పేరు నుంచి కడపను తొలగించడం తగదని పలువురు అభిప్రాయపడగా, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
🚨Big Breaking News 🚨
YSR జిల్లా’ పేరును ‘YSR కడప జిల్లా’గా మారుస్తూ జీవో విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… pic.twitter.com/Py9LSeRzNz
— మన ప్రకాశం (@mana_Prakasam) May 26, 2025
ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత, మళ్లీ జిల్లాకు “కడప” పేరును చేర్చాలని ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయించింది. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మళ్లీ “వైఎస్సార్ కడప జిల్లా” అనే పేరు తిరిగి అధికారికంగా మార్చబడింది.