ఉప్పల్ పెట్రోల్ బంక్‌లో భారీ మోసం..! కస్టమర్ వీడియోతో బయటపడ్డ అసలు రంగు..!

హైదరాబాద్‌ వాహనదారులూ.. మీరు చెల్లించిన డబ్బుకు తగ్గట్టుగా పెట్రోల్ వస్తుందా అనే అనుమానం మీకెప్పుడైనా వచ్చిందా? అయితే ఈ ఘటన మీకు ఒక హెచ్చరికగా నిలవొచ్చు. ఉప్పల్‌ మెహ్ఫిల్‌ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో పెద్ద మోసం బయటపడింది. ఒక వినియోగదారు డిజిల్ పోసిన తర్వాత అదే పరిమాణాన్ని ఖాళీ బాటిల్‌లో కొలిచాడు. రూ.100కు పోసిన పెట్రోల్‌ అసలు పరిమాణానికి తక్కువగా ఉండటంతో ఆయన వీడియో తీసి నేరుగా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.

ఈ వీడియోలో స్పష్టంగా మీటర్ ట్యాంపరింగ్ కనిపించడంతో వైరల్ అయింది. ఇప్పటికే చాలా మంది వినియోగదారులు ఇదే బంక్‌పై ఇలాంటి ఆరోపణలు చేసినట్టు సమాచారం. సంబంధిత ఆయిల్ కంపెనీ అధికారులు వెంటనే స్పందించి, బంక్‌పై విచారణ ప్రారంభించారు. మీటర్లను సీజ్ చేసి లోపల వున్న వ్యవస్థను పరిశీలిస్తున్నారు.

మీటర్ ట్యాంపరింగ్ అంటే ఏమిటి?

పెట్రోల్ పంప్ మీటర్లలో టెక్నికల్ మోసానికి ఇది ఉదాహరణ. మీటర్‌ లీటరు చూపించినా వాస్తవంగా అర్ధ లీటరు తక్కువ పెట్రోల్ పడేలా చేస్తారు. ఇలా రోజుకి వందల మంది కస్టమర్లను మోసం చేసి లక్షల్లో డబ్బు కొల్లగొట్టే అవకాశముంది.

ఈ విషయమై అధికారులు గట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు బంక్ యాజమాన్యం మాత్రం తమపై వచ్చిన ఆరోపణలను తప్పుబడుతున్నాయి. కానీ వీడియోలో కనిపిస్తున్న విజువల్స్ మాత్రం మరీ స్పష్టంగా ఉండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.

వాహనదారులకు సూచన:

పెట్రోల్ పోయించే ముందు మీటర్ సున్నాలో ఉందో లేదో చూసుకోవాలి

లీటర్ కొలవడానికి ట్రాన్స్‌పరెంట్ బాటిల్ వాడటం మంచిదే

అనుమానాస్పదంగా అనిపిస్తే వీడియో తీసి అధికారులకు ఫిర్యాదు చేయాలి

ఉప్పల్‌ ఘటనతో పెట్రోల్ బంక్ మోసాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండడం, అధికారుల చర్యలు వేగవంతంగా ఉండటం ద్వారా ఇటువంటి మోసాల్ని అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply