తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ రాణికుముదిని ప్రకటించారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 9లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాలు, 565 మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.
అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అధికారిణి స్పష్టం చేశారు.
ఐదు దశల్లో ఎన్నికలు
మొత్తం ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుందని ఎస్ఈసీ వివరించారు.
అక్టోబర్ 23న తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్
అక్టోబర్ 27న రెండో విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్
అక్టోబర్ 31న తొలి విడత గ్రామపంచాయతీ పోలింగ్
నవంబర్ 4న రెండో విడత గ్రామపంచాయతీ పోలింగ్
నవంబర్ 8న మూడో విడత గ్రామపంచాయతీ పోలింగ్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు అదేరోజు పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తామని ఎస్ఈసీ తెలిపారు. కాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరగనుంది.
బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
అక్టోబర్ 9 నుండి ఎలక్షన్ కోడ్
మొదటగా అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
తర్వాత అక్టోబర్ 31, నవంబర్ 4, 8న మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు pic.twitter.com/yuZhEEfND9
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2025
కీలక వివరాలు
31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు
రెండు విడతల్లో 5,749 ఎంపీటీసీ, 656 జడ్పీటీసీ ఎన్నికలు
12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో పోలింగ్