సరూర్నగర్ మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. స్టేడియంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 66.5 అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మ వద్ద మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం 10,000కి పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనగా, 1354 మంది మహిళలతో ఒకేసారి బతుకమ్మ ఆడించడం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా ఆడి పాడారు.
వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలతో కలిసి ఆటపాటలతో అలరించారు. బతుకమ్మ చుట్టూ నిల్చొని పాటలు పాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ వేడుకతో అత్యంత పెద్ద జానపద నృత్యం మరియు అత్యంత పెద్ద బతుకమ్మగా రెండు గిన్నిస్ రికార్డులు సృష్టించబడినట్లు సమాచారం.
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో…
గిన్నిస్ రికార్డ్ బతుకమ్మ వేడుకలు…63 అడుగుల ఎత్తయిన బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడుతోన్న 10 వేల మంది మహిళలు#Bathukamma #Telangana pic.twitter.com/ztGnAqu41N
— Congress for Telangana (@Congress4TS) September 29, 2025
స్టేడియంలో ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళలకు సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను పూజించే గొప్ప తెలంగాణ సంస్కృతి ప్రజల్లో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కష్టసుఖాలను పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండగ నిదర్శనమని, అలాగే ప్రకృతి పరిరక్షణకు ప్రజాప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.