ఈసారి కడపలో 10కి 10 కొడతాం.. మహానాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఈసారి రాయలసీమలో అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో సైతం పార్టీ ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించింది. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 సీట్లు గెలుచుకుని తన బలాన్ని మరోసారి నిరూపించింది.

ఈ విజయాల నేపథ్యంలో కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈసారి 7 సీట్లు గెలిచాం.. వచ్చే సారి 10కి 10 గెలవాలి,” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేలా వ్యాఖ్యానించారు. తొలిసారిగా కడపలో జరుగుతున్న మహానాడు చారిత్రకంగా నిలిచిపోతుందన్నారు.

రాయలసీమ ప్రజలు గత ఎన్నికల్లో టీడీపీకి ఇచ్చిన అద్భుత ఆదరణకు కృతజ్ఞతగా మహానాడు కడపలో నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. దేవుని గడపగా ప్రసిద్ధిగాంచిన కడపలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి మహానాడు జరగడం విశేషమని పేర్కొన్నారు.

ఈ మహానాడు రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్న ఆయన, విజయవంతంగా మహానాడు నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి కార్యకర్తకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply