ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తల్లులకు శుభవార్త. “తల్లికి వందనం” పథకం కింద రూ.15 వేల నిధులు రేపే జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, దాదాపు 67.27 లక్షల మంది విద్యార్థులకు చెందిన తల్లుల ఖాతాల్లో రూ.8745 కోట్లు జమ కానున్నాయి.
ముఖ్యమైన హామీ అమలు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాగుతున్న సూపర్ సిక్స్ పథకాల అమల్లో ఇది మరో పెద్ద అడుగు. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలవుతుందన్న మేనిఫెస్టో హామీ మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 వంటి పథకాలను అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తల్లికి వందనం ద్వారా మరో హామీ నెరవేర్చింది.
ప్రభుత్వ వివరాలు
1వ తరగతిలో అడ్మిషన్ పొందిన పిల్లలు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు
ఈ రెండింటికి సంబంధించి కూడా తల్లికి వందనం వర్తించనుంది. అడ్మిషన్లు పూర్తయిన వెంటనే సంబంధిత డేటా ఆధారంగా నిధులు వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నేడు జీఓ విడుదల చేయనుంది.
#TallikiVandanam #AndhraPradesh
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. అందరికీ గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం.
సూపర్ సిక్స్… pic.twitter.com/CCENI7KKCS— Lokesh Nara (@naralokesh) June 11, 2025
లోకేష్ ట్వీట్
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ..
“విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు. మా కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చింది. 67 లక్షలకుపైగా తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానుండడం గొప్ప విషయం.” అని పేర్కొన్నారు.