తెలంగాణ కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు సోమవారం రోజుతో ముగియనున్నాయి. చివరిరోజు కావడంతో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు.
Saraswathi Pushkaralu -2025#saraswathipushkaralu pic.twitter.com/ZVoVE6bsiC
— Collector JS Bhupalpally (@Collector_JSK) May 13, 2025
మే 15న ప్రారంభమైన ఈ పుష్కరాలు తెలంగాణలో తొలిసారి కాళేశ్వరంలో ఘనంగా నిర్వహించబడుతున్నాయి. గతంలో సరస్వతి పుష్కరాలు ఉత్తరాదిలోని ప్రయాగ్రాజ్ వద్ద మాత్రమే జరగడం ఆనవాయితీగా ఉండగా, ఈ సాంప్రదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈసారి తొలిసారిగా దక్షిణాదికి తీసుకువచ్చింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు త్రివేణి సంగమానికి చీరెసారెను సమర్పిస్తూ, సైకత లింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే పితృదేవతలకు పిండప్రదానంతో తమ పూర్వీకుల ఆచారాలను ఆచరిస్తున్నారు.
సరస్వతీ పుష్కరాలు 2025#saraswathi#saraswathipushkaralu#Telangana#pushkaralu pic.twitter.com/9P5uAEgNj0
— Sriram18 o+ (@Srirampusuluri) May 24, 2025
అట్టహాసంగా ముగింపు ఏర్పాట్లు – ప్రముఖుల సందర్శన
చివరిరోజు కావడంతో ఆదివారం నుంచే ట్రాఫిక్ జామ్లు చోటు చేసుకున్నాయి. సెలవుదినం కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. మూడు వైపుల నుంచి వాహనాలు నిలిచిపోయాయి.
గవర్నర్ జిష్ణదేవ్ వర్మ దంపతులు కూడా పుష్కర స్నానంలో పాల్గొన్నారు. వారికి మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే స్వాగతం పలికారు. అలాగే మంత్రి సీతక్క, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కూడా పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వరుని దర్శించారు.
ఈరోజు అట్టహాసంగా ముగింపు కార్యక్రమాలు జరిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పుష్కరాల ముగింపుతో పాటు, భక్తుల రద్దీకి తగిన రక్షణ ఏర్పాట్లు చేపట్టారు.